Borewell: 300అడుగుల లోతైన బోరు బావిలో పడిన రెండున్నరేళ్ల బాలిక.. సహాయక చర్యలు ముమ్మరం!
300 అడుగుల లోతైన బోరు బావిలో చిన్నారి పడిపోయినన ఘటన మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లాలో కలకలం రేపింది. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
సెహోర్: మధ్యప్రదేశ్లో సీహోర్ జిల్లాలో రెండున్నరేళ్ల బాలిక బోరుబావి(Borewell)లో పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 300 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో చిన్నారి పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారి ప్రస్తుతం 20 అడుగుల వద్ద ఇరుక్కుపోయి ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది.. బాలికను సురక్షితంగా బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ముగావళి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. సమాచారం తెలుసుకున్న సిబ్బంది జేసీబీ యంత్రాలతో అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఆ చిన్నారి పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తన సొంత జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ స్పందించారు. బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, సీఎంవో కార్యాలయం అధికారులు జిల్లా యంత్రాంగంతో టచ్లో ఉంటూ నిరంతరం పరిస్థితిని తెలుసుకొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
మైనర్ బాలికతో తనకు జరిగే నిశ్చితార్థాన్ని అధికారులు ఆపారనే క్షణికావేశంలో ఓ యువకుడు ఆ బాలిక తల నరికి హత్య చేశాడు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. -
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.