Crime News: విహారయాత్రలో విషాదం.. న్యూయార్క్‌లో విజయవాడ వాసి మృతి

విహారయాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృత్యుఒడికి చేరాడు.

Published : 12 Oct 2022 17:36 IST

న్యూయార్క్‌: విహారయాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృత్యుఒడికి చేరాడు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ సమీపంలోని పోరంకి వసంత్‌నగర్‌ కాలనీకి చెందిన నెక్కలపు హరీష్‌ చౌదరి(35) ఎంటెక్‌ పూర్తి చేసి కెనడాలో టూల్‌ మేకర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్‌ విహారయాత్రకు వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఇతాకా జలపాతంలో జారిపడి మృతి చెందాడు. హరీష్‌ మృతితో కుటుంబ సభ్యుల్లో పెను విషాదం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని