బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు

నగర శివారు బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు.

Published : 09 May 2024 11:58 IST

హైదరాబాద్‌: నగర శివారు బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. ఆరుగురిని అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్‌రెడ్డి, సైట్‌ ఇంజినీర్‌ సతీష్‌, ప్రాజెక్టు మేనేజర్‌ ఫ్రాన్సిస్‌, గుత్తేదారు రాజేశ్‌, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. మరోవైపు ఈ ఘటనలో మృతి చెందిన ఏడుగురి మృతదేహాలకు శవపరీక్ష పూర్తి చేసిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు.

బాచుపల్లిలో కౌసల్యకాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ ప్రహరీ మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయి దానిని ఆనుకొని ఉన్న రేకులషెడ్డుపై పడటంతో అందులో నివసిస్తున్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఐదంతస్తుల భవనాన్ని రైజ్‌ డెవలపర్స్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇక్కడ గతంలో 10-15 అడుగుల ఎత్తు వరకు ప్రహరీని నిర్మించారు. తరువాత దానినే 30-40 అడుగులకు పెంచడంతో వర్షపు నీటికి పునాదులు బలహీనపడి కూలిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని