Crime news: డ్రగ్స్ బానిస వల్లే.. కేరళ మోడల్స్ మృతి చెందారు..!
నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కేరళ మోడల్స్ మృతిచెందిన ఘటనలో బుధవారం పోలీసులు కీలక విషయం వెల్లడించారు. డ్రగ్స్కు బానిసైన సైజు అనే వ్యక్తే ప్రధాని నిందితుడని తెలిపారు.
కీలక విషయం వెల్లడించిన పోలీసులు
తిరువనంతపురం: నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ మోడల్స్ మృతిచెందిన ఘటనకు సంబంధించి బుధవారం పోలీసులు కీలక విషయం వెల్లడించారు. డ్రగ్స్కు బానిసైన సాయిజు థంకచన్ అనే వ్యక్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని తెలిపారు. అక్టోబర్ 31 రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్ (24), అదే పోటీలో రన్నరప్గా నిలిచిన అంజనా షాజన్ (25) దుర్మరణం చెందారు. కోచికి సమీపంలోని వైటిల్లా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో బోల్తా కొట్టింది. ఘటనాస్థలంలోనే వారిద్దరు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరోవ్యక్తి వారం వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్ చేస్తున్న వారి స్నేహితుడికి మాత్రం ప్రాణాపాయం తప్పింది.
అసలేం జరిగిందంటే..
అన్సీ, అంజనా తన స్నేహితులతో కలిసి అక్టోబర్ 31న ఒక పార్టీకి వెళ్లగా.. అక్కడే సాయిజు థంకచన్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో నిందితుడు మోడల్స్తో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, రాత్రి పూట హోటల్లో బస చేసేందుకు ఏర్పాటు చేయగలనని వారితో మాట్లాడినట్లు పేర్కొన్నారు. దాంతో ఈ ఇద్దరు మోడల్స్ వారి స్నేహితులతో కలిసి హోటల్ నుంచి బయటకు వచ్చి కారులో ఇళ్లకు వెళ్లిపోతుండగా.. సాయిజు కూడా వారిని అనుసరించాడు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి దీన్ని గమనించి వేగంగా కారు నడపడం ప్రారంభించారని చెప్పారు. అదే ఘోర ప్రమాదానికి దారితీసింది. అయితే, ఈ ఘటనలో సాక్ష్యాలను ధ్వంసం చేశారని, హోటల్ యజమాని భయపడుతున్నారని అంజన సోదరుడు అర్జున్ ఆరోపించారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా నిందితుడిని పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM