Hyderabad News: రాజేంద్రనగర్‌లో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదాంతం

రాజేంద్రనగర్‌లో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదాంతమైంది. ఇంట్లో ఆడుకుంటూ కనిపించకుండా పోయిన కుమారుడి కోసం రెండో రోజు తల్లిదండ్రులు గాలిస్తుండగా....

Updated : 28 Aug 2021 15:38 IST

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌లో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదాంతమైంది. ఇంట్లో ఆడుకుంటూ కనిపించకుండా పోయిన కుమారుడి కోసం రెండో రోజు తల్లిదండ్రులు గాలిస్తుండగా.. సమీపంలోని చెరువులో చిన్నారి మృతదేహం కనిపించింది. విగతజీవిగా బాలుడిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారిని హత్య చేసి చెరువులో పడేసి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలుడి కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో రాజేంద్ర నగర్‌ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని