Andhra News: కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. భయంతో జనం పరుగులు
శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. నిత్యం రద్దీగా ఉండే మార్గంలో భవనం కూలడం.. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. భయాందోళనతో జనం పరుగులు తీశారు. పలాస కేటీ రోడ్డులో చిరు వ్యాపారం నిర్వహిస్తున్న మల్లా కామేశ్వరరావుకు చెందిన రెండు అంతస్తుల భవనం గురువారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. భవనం శిథిలాలు పక్కనే ఉన్న పలాస మండలం శాసనాం గ్రామానికి చెందిన పార్వతీశం టీ దుకాణంపై పడ్డాయి. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై సరఫరా నిలిపివేశారు. పురపాలక సంఘం అధ్యక్షుడు బల్ల గిరిబాబు, తహసీల్దార్ మధుసూదన్, కమిషనర్ రాజగోపాల్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాశీబుగ్గ పోలీసులు అక్కడకు చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. నిత్యం రద్దీగా ఉండే మార్గంలో భవనం కూలడం.. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పాత భవనం కావడంతో వర్షాలకు గోడలు తడిసి కూలిందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళలో ఏనుగు దాడి
కేరళలో గుంపు నుంచి తప్పిపోయిన అడవి ఏనుగు దాడిలో ఎ.వి.ముకేశ్ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ప్రముఖ న్యూస్ ఛానల్ ‘మాతృభూమి’ కెమెరామన్గా, కాలమిస్ట్గా పనిచేస్తున్న ముకేశ్ రిపోర్టరుతో కలిసి మలమ్పుఝా - కంజికోడ్ మార్గంలో నదిని దాటే ఏనుగుల గుంపు దృశ్యాల చిత్రీకరణకు వెళ్లాడు. -
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్
గుజరాత్లోని దాహోద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకుడి కుమారుడైన విజయ్ భాభోర్.. పోలింగ్ కేంద్ర లోపల నుంచి ఇన్స్టా లైవ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
అత్యాచారం కేసు నిందితుడు 40 ఏళ్ల తర్వాత దొరికాడు
అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత అరెస్టు చేసిన ముంబయి పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ముంబయికి చెందిన పాపా అలియాస్ దావూద్ 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. -
ఈవీఎంలలో చిప్ మారుస్తా.. మిమ్మల్ని గెలిపిస్తా
డబ్బులిస్తే ఈవీఎంలలో చిప్ను మార్చి ఎక్కువ ఓట్లు పడేలా చేస్తానని మోసగించేందుకు యత్నించిన ఓ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..