కారు బానెట్‌పై యువతిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను ఓ వ్యక్తి కారు బానెట్‌పై సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు.

Updated : 18 Aug 2023 12:36 IST

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను ఓ వ్యక్తి కారు బానెట్‌పై సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. జంక్షన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కారు రాంగ్‌ సైడ్‌లో వచ్చింది. ఇంతలో ఓ యువతి ఆ కారుకు అడ్డం వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ క్రమంలో కారు యువతి పైకి వెళ్లగా ఆమె రక్షణగా బానెట్‌ను పట్టుకుంది. అయితే డ్రైవర్‌ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. ఇది చూసి స్థానికులు కారు వెంట పరుగులు తీశారు. అయినా డ్రైవరు కారును ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కారును గుర్తించామని జంక్షన్‌ స్టేషన్‌ ఇంఛార్జ్‌ విష్ణు ఖత్రి తెలిపారు. అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టినప్పటికీ బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని