చనాఖా-కొరాట నీరు... చేనుకు ఎప్పుడు చేరు?
తెలంగాణ స్వరాష్ట్రమైన ఏడాదికే కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చనాఖా-కొరాట బ్యారేజీ నుంచి ఈ రబీలో పంటకు సాగు నీళ్లు రావడం కష్టమే.
ఈటీవీ - ఆదిలాబాద్
తెలంగాణ స్వరాష్ట్రమైన ఏడాదికే కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చనాఖా-కొరాట బ్యారేజీ నుంచి ఈ రబీలో పంటకు సాగు నీళ్లు రావడం కష్టమే. ప్రధాన కాలువ, బ్యారేజీని మినహాయిస్తే డిస్ట్రిబ్యూటర్లు, పిల్లకాలువల పని ఇంకా ప్రారంభమే కాలేదు. డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలనిర్మాణానికి అవసరమైన దాదాపు వెయ్యి ఎకరాల భూసేకరణ పూర్తికాకపోవడం ప్రతిబంధకంగా మారింది. తక్షణం రూ.100 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తే తప్ప పనులు జరిగేలా కనిపించడం లేదు. బ్యారేజీ పనులను ఒప్పందం(అగ్రిమెంట్) ప్రకారం 2018లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు చేజిక్కించుకున్న ప్రధాన గుత్తేదారు ఉమ్మడి జిల్లాలోని ఓ కీలక నేత బంధువు. దాంతో ఆయనపై అధికారుల ఒత్తిడి చేయకపోవడంతో ఆశించిన రీతిలో పనులు జరగలేదు. ఫలితంగా ప్రారంభంలో రూ.386 కోట్ల అంచనా వ్యయం ఏకంగా రూ.750 కోట్లకు చేరింది. ఇందులో రూ.150 కోట్ల విలువ చేసే ఆరు పంపులు, మరో రూ.60 కోట్ల విలువ చేసే సబ్స్టేషన్, మరో 13 శాతం జీఎస్టీ మినహా మిగిలినదంతా పనుల జాప్యం వల్లనే వ్యయం పెరిగింది. ఇటీవల బ్యారేజీ పనుల డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్)కు సాంకేతిక సలహా సంఘం ఆమోద ముద్ర లభించింది. దీనివల్ల భవిష్యత్తులో బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందే తప్ప క్షేత్రస్థాయిలో జరిగే పనులతో పెద్దగా సంబంధమేమీ లేదు.
ఎత్తిపోసేనా?
పెన్గంగా బ్యారేజీలో బిగించిన ఈ మోటార్లు దుమ్ముగూడెం రిజర్వాయర్ కోసం 2005లో అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసినవి. అక్కడ సరిపోనందున ప్రత్యామ్నాయంగా చనాఖా-కొరాట బ్యారేజీకి మార్చారు. 17ఏళ్లపాటు మూలనపడి ఉన్న వాటిని ఇటీవలే బిగించినా డ్రైరన్, ట్రయల్ రన్ పూర్తి చేయాల్సి ఉంది. పిల్లకాలువలు పూర్తికానందున నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఎత్తిపోస్తే ప్రధాన కాలువకు చివరన ఉన్న బేల మండలం చప్రాల వద్ద నీరు పొంగిపొర్లి అవతలవైపు ఉన్న చేలలోకి వృథాగా పోయే అవకాశం ఉంది. ఈ మోటార్లను ప్రస్తుతానికి నమూనాగా చూపించడమే తప్ప నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు.
హామీలకే పరిమితం
చనాఖా-కొరాట బ్యారేజీకి ప్రధానమైన కాలువలు రెండు. ఇందులో మొదటిది లోయర్ పెన్గంగా ప్రాజెక్టు(ఎల్పీపీ) కాలువ పొడవు 42 కి.మీ. దీని ద్వారా బేల, జైనథ్, ఆదిలాబాద్ మండలాల పరిధిలోని 37,500 ఎకరాలకు సాగు నీరందించాలనేది లక్ష్యం. ప్రధాన కాలువ నిర్మాణ పని 90 శాతం పూర్తయింది. దాదాపుగా 90 కి.మీ. పొడవున కొనసాగించాల్సిన పిల్ల కాలువలకు అవసరమైన 700 ఎకరాల భూసేకరణ జరగకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ప్రధాన కాలువలకు నీళ్లు వదలడం ప్రశ్నార్థకంగా మారింది.
* రెండో కాలువ చనాఖా-కొరాట బ్యారేజీ(సీకేబీ) కాలువ పొడవు 3.3 కి.మీల ద్వారా భీంపూర్ మండలం పిప్పల్కోటిలో వెయ్యి ఎకరాల బ్యాలెన్సింగ్ నీటి కోసం వినియోగించాల్సి ఉంది. మండలంలో మరో 13,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. పిల్లకాలువల కోసం మరో 100 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. అంటే మొదటి కాలువ ఎల్పీపీ, రెండో కాలువ సీకేబీ ప్రధాన కాలువల నిర్మాణం 90 శాతం పూర్తయినా పిల్లకాలువల కోసం అవసరమైన 800 ఎకరాల భూసేకరణలో స్తబ్ధత నెలకొంది. భూసేకరణకు కలెక్టర్ నేతృత్వంలో రైతులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ముంపునకు గురయ్యే భూమికి ధర నిర్ణయించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిధ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?