పంచాయతీలకు రూ. 33 కోట్లు మంజూరు
మావల మండల కేంద్రంలో సీసీ రోడ్లకు రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. పాలకవర్గ అనుమతితో నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నారు.
సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ‘ఉపాధి హామీ’ నిధులు
న్యూస్టుడే, ఆదిలాబాద్ గ్రామీణం, మావల
మావల మండల కేంద్రంలో సీసీ రోడ్లకు రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. పాలకవర్గ అనుమతితో నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, మురుగు కాలువలు మెరుగుపడనున్నాయి. ఉపాధిహామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.33.08 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె ప్రగతి, 15వ ఆర్థిక సంఘం నిధులు సరిపోక ఇబ్బందుల్లో ఉన్న పాలకవర్గాలకు తాజాగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం కొంత ఊరటనిచ్చింది. గతేడాది ఇదే పథకం కింద రూ.30 కోట్లకు సంబంధించి పనులు చేయగా రూ.18 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించారు. మరో రూ.12 కోట్లు రావాల్సి ఉంది. వడ్డీకి అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు విడతలుగా 445 పనులు
ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం నిమిత్తం ఏటా మెటీరియల్ కాంపోనెంట్ నిధులను విడుదల చేస్తారు. కూలీల చెల్లింపులకు 40 శాతం, నిర్మాణ సామగ్రి వాటా కింద 60 శాతం నిధులను ఆయా పంచాయతీలకు కేటాయిస్తారు. సాధారణంగా ఈ పనులను స్థానిక ఎమ్మెల్యేల సూచనతో కలెక్టర్ ఛైర్మన్గా ఉన్న కమిటీ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. మొదటి విడత కింద 179 పనులకు రూ.13.78 కోట్లు, రెండో విడత కింద 266 పనులకు రూ.20.30, మొత్తం 445 పనులకు గాను రూ.33.08 కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు పనులను పర్యవేక్షించనున్నారు.
చేపట్టకపోతే వెనక్కి
పంచాయతీ పాలకవర్గం తీర్మానాన్ని అనుసరించి ఎక్కడ సీసీ రోడ్డు, మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలో నిర్ణయించనున్నారు. నామినేషన్ పద్ధతిన పాలకవర్గం సూచించిన వ్యక్తి పనులు చేస్తే.. సర్పంచి పేరిట బిల్లులు విడుదలవుతాయి. గతంలో గడువు తక్కువగా ఉందని హడావుడిగా పనులు పూర్తి చేయడంతో కొన్నిచోట్ల నాణ్యత లోపించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలలే సమయం ఉండటంతో ఈలోగా పనులు చేయాలి. లేకపోతే నిధులు వెనక్కిమళ్లే ప్రమాదముంది. దీంతో త్వరగా తీర్మానం పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు.
మార్చి 25లోగా పూర్తి చేయాలి
మహావీర్, ఈఈ, పంచాయతీరాజ్
జిల్లాలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి రెండు విడతలుగా రూ.33.08 కోట్లు మంజూరయ్యాయి. రెండో విడత కింద మంజూరైన రూ.20.30 కోట్లకు సంబంధించి పాలనాధికారి ఆమోదం తీసుకోవాల్సి ఉంది. మార్చి 25 లోగా పనులను పూర్తి చేయాలి. తర్వాత ఎంబీ రికార్డు తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. పనులు చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లిపోతాయి.
ఆదిలాబాద్ గ్రామీణం మండలంలోని దిమ్మ పంచాయతీలో వర్షపు నీరు బయటకు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రూ.5లక్షల మంజూరుతో సమస్య పరిష్కారం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిధ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?