పెరిగిన సహకారం.. అన్నదాతపై మమకారం
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆదాయపన్ను మినహాయింపులు పెంపు, మధ్య తరగతి సొంతింటి కల నెరవేరేలా కేటాయింపులు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం, యువత ఉపాధికి చేసిన కేటాయింపులు ఆయా వర్గాలకు ఊరటనిచ్చాయి.
కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఆశలు
న్యూస్టుడే, ఆదిలాబాద్ పాలనాప్రాంగణం
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆదాయపన్ను మినహాయింపులు పెంపు, మధ్య తరగతి సొంతింటి కల నెరవేరేలా కేటాయింపులు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం, యువత ఉపాధికి చేసిన కేటాయింపులు ఆయా వర్గాలకు ఊరటనిచ్చాయి. కేంద్ర బడ్జెట్తో జిల్లావాసులకు కలిగే లబ్ధిపై ‘న్యూస్టుడే’ కథనం.
పంట రుణాల పెంపు
జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అండగా నిలవనుంది. ఆహార ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధరకు పెద్దపీట వేయడం కలిసొచ్చే అంశం. వ్యవసాయ రుణాలు అందించనున్నారు. పంట రుణ లక్ష్యాన్ని 11 శాతం పెంచనున్నారు. పశు పోషణ, మత్స్య, పాడి పరిశ్రమలకు రుణాలు ఇవ్వనున్నారు. చిన్న రైతులకు వడ్డీలేని రుణ పరిమితిని రూ.లక్ష నుంచి 1.6 లక్షలకు పెంచడం, ‘పీఎం-ప్రణామ్’ పథకం కింద రసాయన ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి సాగుకు ప్రోత్సాహకాలు ఇస్తుండటం ఊరనిచ్చే అంశం. పది వేల బయో-ఇన్ఫుట్ రిసోర్స్సెంటర్లలో ఒకటి మనకు రావచ్చు. ఉద్యానవన పంటల సాగుకు ‘ఆత్మ నిర్భర్ హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్’ పథకం మేలు చేకూర్చనుంది. పబ్లిక్ ప్రైవేటు భాగ్యస్వామ్యం ద్వారా చేపట్టనున్నారు.
వ్యవసాయ రుణ లక్ష్యం: రూ. 20 లక్షల కోట్లు
జిల్లాలో రైతులు : 1,46,591
కొంతే ఊరట..
కేంద్ర బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపులు వేతన జీవులకు కొంతే ఊరటనిచ్చింది. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల లోపు ఆదాయమున్న వారికి పన్ను పోటు లేదని ప్రకటించారు. గతంలో ఆరు స్లాబులు ఉంటే అయిదు స్లాబులకు కుదిస్తూ పన్ను మినహాయింపులు ఇచ్చారు.
పన్నుమినహాయింపు : రూ. 7 లక్షల వరకు
కొత్తవిధానం ఎంచుకుంటే లబ్ధి పొందే వేతనజీవులు : దాదాపు 15 వేల మంది
మత్స్య సంపద పెంపునకు చర్యలు
చేపలు పట్టుకుని జీవనం పొందే వారిని అన్ని విధాలుగా ఆదుకునేలా ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ కొత్త పథకం తీసుకురానుంది. జిల్లాలోని 72 మత్స్య సహకార సొసైటీలోని 2,558 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ప్రోత్సాహం అందించనుండటంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
మత్స్య సహకార సొసైటీలు: 72
మత్స్యకార కుటుంబాలు: 2,558
కంప్యూటరీకరణ దిశగా..
చిన్న, సన్నకారు రైతుల సంక్షేమానికి సహకార వ్యవస్థ తోడ్పాటును అందిస్తుంది. జిల్లాలో సహకార సంఘాలు 438 ఉన్నాయి. దేశవ్యాప్తంగా 63 వేల సంఘాలను కంప్యూటరీకరణ చేయడంతోపాటు రూ.2,516 కోట్లు కేటాయించనున్నారు. వీటిని బహుళ ఉపయోగ కేంద్రాలుగా తీర్చిదిద్దనుండటంతో రైతులకు మేలు జరగనుంది. గ్రామాల్లో పీఏసీఎస్, ప్రాథమిక మత్స్య సొసైటీలు, డెయిరీ సహకార సొసైటీలు ఏర్పాటు చేయనుండటంతో అన్నదాతలకు కేంద్రం నుంచి మరింత ‘సహకారం’ అందనుంది.
జిల్లాలో సహకార సంఘాలు : 438
సహకార సంఘ సభ్యులు: 79,662
ఏకలవ్య పాఠశాలలకు ప్రాధాన్యం
నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేలా మూడేళ్ల శిక్షణకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకానికి నిధులు పెంచింది. జిల్లా విద్యా శిక్షణా సంస్థలను ఎక్స్లెన్సు కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. మోడల్ ఏకలవ్య పాఠశాలల్లో 38,800 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ చేయనున్నారు. గిరి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నిరుద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
జిల్లాలో ఏకలవ్య పాఠశాలలు మొత్తం : 03
భర్తీ అయ్యే పోస్టులు : 100కి పైగా
సొంతింటి ‘కల’ నెరవేరేలా..
ఇల్లు లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.79 వేల కోట్లు కేటాయించడంతో వారి కల నెరవేరనుంది. ప్రస్తుతం రెండు పడక గదుల పథకం కింద జిల్లాలో 3,559 ఇళ్లు మంజూరయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇళ్లు లేని లబ్ధిదారుల సంఖ్య 50వేలకు పైగా ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం.. రాష్ట్రప్రభుత్వం కూడా స్థలం ఉంటే రూ.3లక్షలు కేటాయిస్తామని ఇదివరకే ప్రకటించడం జిల్లాలో పేదలకు సొంతింటి ‘కల’ నెరవేరే అవకాశముంది.
రెండు పడక గదుల ఇళ్ల మంజూరు : 3,559
ఇంకా ఇళ్లు అవసరం ఉన్న కుటుంబాలు: 50 వేల పైనే
మహిళలకు పొదుపు మంత్రం..!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం కొత్త పొదుపు పథకాలను బడ్జెట్లో ప్రకటించారు. మహిళా సమ్మాన్ సేవింగ్ పత్ర పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. మహిళలు, బాలికలకు సంబంధించిన ఈ పథకం కింద రెండేళ్లపాటు డిపాజిట్లు చేస్తే 7.5 శాతం స్థిరవడ్డీ లభించనుంది. గరిష్ఠంగా రెండు లక్షల వరకు ఖాతాలో జమ చేసుకోవచ్చు.
జిల్లాలో మహిళా సంఘాలు : 10,709
సభ్యులు మొత్తం: 1,16,242
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిధ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్