భయంగా వచ్చాం.. ఆనందంతో వెళ్తున్నాం
భయం భయంగా వచ్చాం.. ఏడాది పాటు విద్యాలయంలో చదువుకున్నాం. ఆనందంగా తిరిగి ఈ నెల 30న సొంత ప్రాంతానికి తిరిగి ప్రయాణమవుతున్నామంటూ..
‘మైగ్రేషన్’పై వచ్చిన శివపూరి విద్యాలయం విద్యార్థుల అభిప్రాయాలివి
మధ్యప్రదేశ్లోని శివపూరి విద్యాలయం విద్యార్థులు
కాగజ్నగర్, న్యూస్టుడే: భయం భయంగా వచ్చాం.. ఏడాది పాటు విద్యాలయంలో చదువుకున్నాం. ఆనందంగా తిరిగి ఈ నెల 30న సొంత ప్రాంతానికి తిరిగి ప్రయాణమవుతున్నామంటూ.. మైగ్రేషన్పై వచ్చిన విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు జవహర్ నవోదయ విద్యాలయం ‘మైగ్రేషన్’ (వలస) విధానాన్ని అమలు చేస్తోంది. విద్యార్థిదశలోనే జాతీయసమైక్య భావాన్ని పెంపొందించేందుకు ఓ ఆనవాయితీని కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న విద్యాలయాల్లో ఒక రాష్ట్రం విద్యార్థులు మరో రాష్ట్రంలో ఏడాదిపాటు చదవాలనేది స్పష్టమైన నిబంధన. విద్యాలయాల్లో 9వ తరగతి చదివే వారు ఈ విధానంలో ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటారు. కాగజ్నగర్ విద్యాలయ విద్యార్థులు మధ్యప్రదేశ్లోని శివపూరి విద్యాలయం, అక్కడి విద్యార్థులు స్థానిక విద్యాలయంలో ఏడాదిపాటు చదువుకుంటారు. 2020-21, 2021-22 రెండేళ్ల పాటు కరోనా కారణంగా ఈ విధానాన్ని నిలిపి వేయగా.. 2022-23లో 9వ తరగతి 25 మంది విద్యార్థులు(17 బాలురు, 8 మంది బాలికలు)ఏడాది పాటు ఇక్కడికి వచ్చి చదివారు. వార్షిక పరీక్షలు ముగియగా.. మధ్యప్రదేశ్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ వారి మనోగతాన్ని సేకరించింది.
మైగ్రేషన్ విధానం అమలు..
9వ తరగతి ప్రారంభంలోనే మైగ్రేషన్ విధానంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల పేర్లు ప్రిన్సిపల్ సేకరిస్తారు. లేకుంటే సంఖ్యను బట్టి 30శాతం విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎవరూ ముందుకు రాకపోతే ఆయా మండల విద్యాధికారి సమక్షంలో లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారు.
క్రమశిక్షణకు మారు పేరు
- చక్రపాణి, ప్రిన్సిపల్, విద్యాలయం
మైగ్రేషన్పై వచ్చిన విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరు. సమయపాలన, చదువుల్లోనూ అత్యంత ప్రతిభావంతులు. స్థానిక విద్యార్థులతో కలిసి మెలిసి ఉండేవారు. తెలుగుపై మంచి పట్టు సాధించారు. వారి అభిప్రాయాల మేరకు ఇష్టమైన ఆహారాన్ని, సదుపాయాలను ఏర్పాటు చేశాం. ఏ ఒక్కరోజు కూడా వారితో ఇబ్బందులు తలెత్తలేదు.
అదృష్టంగా భావిస్తున్నా
- చాందినీ సోలంకి, శివపూరి
హైదరాబాద్ పేరును పత్రికలు, టీవీల్లోనే చూశా. విజ్ఞానయాత్ర పేరిట మమ్మల్ని అక్కడకు తీసుకెళ్లారు. గోల్కొండ కోట, పార్కులు, మ్యూజియం, బిర్లామందిర్ తదితర వాటిని చూశా. దక్షిణ భారత సంస్కృతి, సంప్రదాయాలు తెలిశాయి. విద్యాలయంలో ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ సొంత పిల్లల మాదిరిగా చూసుకున్నారు. ఇక్కడ ఏడాదిపాటు చదువుకోవడం అదృష్టంగా భావిస్తున్నా.
సంస్కృతి, సంప్రదాయాలు బాగున్నాయి
- రాధిక నామ్దెవ్, శివపూరి
మా రాష్ట్రంలో కంటే తెలంగాణలో సంస్కృతీ సంప్రదాయాలు బాగున్నాయి. స్థానిక విద్యాలయంలోనే చదువుతూ ఇష్టమైన బ్రేక్, కూచిపూడి నృత్యాలు నేర్చుకున్నా. గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా దేశభక్తి గీతాలపై నృత్యం చేశా. మొదట్లో నాకు తెలుగు మాట్లాడటం, రాయటం రాదు. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థినులు సూచనలు, సలహాలను తీసుకొని, నేర్చుకున్నా.
ఇక్కడి వారి ఆదరణ నచ్చింది
- అర్జున్, శివపూరి
ఇక్కడ విద్యాబోధన బాగుంది. పండగలు, ఆచారాలు తెలుసుకున్నా. ఆప్యాయత, అనురాగం స్థానిక విద్యార్థుల ద్వారా తెలిసింది. ఏ ఒక్కరోజు కూడా మమ్మల్ని వేరుగా చూడలేదు. ఏడాదిపాటు చదువు అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఉపాధ్యాయుల బోధన వల్లే మంచి మార్కులతో టాపర్గా నిలవడం ఆనందంగా ఉంది. క్రీడలపై కూడా ఆసక్తి పెరిగింది. ఇటీవల జాతీయ స్థాయి క్రీడల్లోనూ పాల్గొని, అవార్డు సాధించా.
ప్రారంభంలో ఇబ్బంది పడ్డా
- ప్రేమ్చంద్, శివపూరి
ఇక్కడికి రాగానే ప్రారంభంలో చాలా ఇబ్బంది పడ్డా. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల స్నేహం ఏర్పడిన తర్వాత ఇబ్బందులు తలెత్తలేదు. మా విద్యాలయం కంటే ఇక్కడ క్రమశిక్షణ, సమయపాలన కచ్చితంగా అమలు చేస్తారు. తెలుగు, ఆంగ్లంపై మంచి పట్టు సాధించా. ఇబ్బందులు లేకుండా మాకు ఇష్టమైన భోజనం, తదితర వాటిని ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు. మా విద్యాలయంలోనూ విద్యార్థులకు భోజనం చేసే సమయంలో క్రమశిక్షణ పాటించాలంటూ నేర్పిస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిధ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్