ఉపాధిహామీ పథకం రద్దుకు భాజపా కుట్ర: మంత్రి
కరోనా సమయంలో పనులు లేక అల్లాడిన నిరుపేదలను ఉపాధిహామీ పథకం కడుపు నింపిందని, అలాంటి గొప్ప పథకాన్ని పనిదినాలు తగ్గిస్తూ పూర్తిగా తొలగించేందుకు భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు.
కూలీలతో కలిసి నేలపై కూర్చుండి మాట్లాడుతున్న మంత్రి సీతక్క
సారంగాపూర్, న్యూస్టుడే: కరోనా సమయంలో పనులు లేక అల్లాడిన నిరుపేదలను ఉపాధిహామీ పథకం కడుపు నింపిందని, అలాంటి గొప్ప పథకాన్ని పనిదినాలు తగ్గిస్తూ పూర్తిగా తొలగించేందుకు భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సారంగాపూర్ మండలం ఆలూర్, చించోలి(ఎం), వంజర్, బీరవెల్లి గ్రామాల్లో ఆమె పర్యటించారు. కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. వారి సమస్యలు సౌకర్యాలపై ఆరాతీశారు. నాలుగు నెలల ప్రభుత్వంపై ప్రతిపక్ష భారాస అర్థంలేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పుల పాపానికి రూ.29 వేల కోట్ల వడ్డీ చెల్లించామన్నారు. ఈ డబ్బులతో రైతుల రుణమాఫీ ఎప్పుడో జరిగేదన్నారు. అయినా ఆగస్టు 15 లోగా రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల్లో అయిదింటిని అమలు పరుస్తున్నామని చెప్పారు. ఎన్నికలు ముగియగానే కొత్త పింఛన్లు, రేషన్కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. పదేళ్ల పాలనలో భాజపా చేసిందేమీ లేద,ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన గుడి, బడి, రహదారులు, ఇల్లు, ప్రాజెక్టులే నేడూ కనిపిస్తున్నాయన్నారు. ప్రజల సొమ్ముతో అయోధ్యలో కట్టిన గుడిని చూపించి ఓట్లు దండుకోవాలని భాజపా ప్రయత్నిస్తోందని విమర్శించారు. భాజపాకు వేసే ప్రతి ఓటు రాజ్యాంగం తొలగింపును అంగీకరించినట్లే అవుతుందని, దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు కూడా లేకుండా పోతాయని పేర్కొన్నారు. తొలిసారి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో ఆడబిడ్డ ఆత్రం సుగుణ బరిలో నిలిచిందని, ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి విశ్వనాథ్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, సీనియర్ నాయకులు రాజ్మహ్మద్, నర్సయ్య, అబ్దుల్ ఆది, శ్రీనివాస్రెడ్డి, మారుతి, వెంకటరమణారెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి
నిర్మల్, న్యూస్టుడే : పార్లమెంటు ఎన్నికలకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉందని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి ఆదివాసీ ముద్దుబిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అధ్యక్షతన జరిగిన నిర్మల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి తొలిసారిగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయడానికి మహిళకు అవకాశం ఇచ్చారని, అందరూ సమన్వయంతో ఉండి ఆమె గెలుపు కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్గాంధీని ప్రధానమంత్రి చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, టీపీసీసీ కార్యదర్శి శ్రావణ్కుమార్రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ అప్పాల గణేశ్, ఏఐసీసీ కార్యదర్శి నరేశ్ జాదవ్, జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
-
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
-
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు నేడే