logo

క్రాంతినగర్‌లో పోలీసుల కవాతు

పట్టణంలోని క్రాంతినగర్‌లో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాద విషయమై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు.

Updated : 05 May 2024 13:53 IST

ఎదులాపురం: పట్టణంలోని క్రాంతినగర్‌లో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాద విషయమై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు. ఒక వర్గానికి చెందిన జెండా విషయమై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా బందోబస్తును డీఎస్పీ పర్యవేక్షించారు. ఎలాంటి అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఈ బందోబస్తులో పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు పాల్గొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని