logo

కాంగ్రెస్ పార్టీని బలపర్చండి

రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Updated : 08 May 2024 17:40 IST

అదిలాబాద్ సాంస్కృతికం: రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాసేవ కోసం ఉపాధ్యాయ వృత్తిని వదిలి రాజకీయ రంగంలో దిగిన ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో నాయకులు రాములు, అరుణ్, పొచ్చిరాం, నర్సింగ్ రావు, రాందాస్ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని