సమస్యల పరిష్కారానికే ‘స్పందన’
మన్యంలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రతి వారం ఐటీడీఏ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే పేర్కొన్నారు.
సమస్యలు వింటున్న ఐటీడీఏ పీఓ సూరజ్ గనోరే, సబ్ కలెక్టర్ శుభం బన్సల్
రంపచోడవరం, న్యూస్టుడే: మన్యంలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రతి వారం ఐటీడీఏ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ శుభం బన్సల్, సహాయ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసరావుతో కలిసి ఆయన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 46 మంది వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. దేవీపట్నం మండలం గిన్నేపల్లి తాటివాడలో గిరిజన ప్రాథమిక పాఠశాల భవనం పనులు మొదలుపెట్టి సగంలోనే నిలిపివేశారని, దీనిని వెంటనే పూర్తి చేయించాలని సర్పంచి కె.బుచ్చన్నదొర, కలుం స్వామిదొర తదితరులు కోరారు. డి.ఎన్.పాలెం పంచాయతీ మునకలగూడెం నుంచి సీహెచ్.గంగవరం వరకు రెండు కిలోమీటర్ల మెటల్ రోడ్డు వేయాలని సర్పంచి రత్నారెడ్డి వినతిపత్రం అందజేశారు. రంపచోడవరం మండలం చిలకమామిడికి చెందిన ఒంటుకుల రామాయమ్మ జీవనోపాధి నిమిత్తం కిరాణా దుకాణం పెట్టుకొనేందుకు తనకు రూ. లక్ష రుణం మంజూరు చేయాలని కోరారు. రంపచోడవరం మండలం భీమవరం నుంచి మారేడుమిల్లి మండలం నరసాపురం వరకు పది కిలోమీటర్ల వరకు తారు రోడ్డు పనులు అటవీ అభ్యంతరాలతో నిలిచిపోయాయని, ఈ పనులు పూర్తి చేయాలని మాజీ సర్పంచి కుంజం వెంకటరమణ ఆధ్వర్యంలో గిరిజనులు కోరారు. గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక ఉప కలెక్టర్లు జాన్బాబు, డి.ఎస్ శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజినీర్లు (ఈఈ) నాగేశ్వరరావు, ఎండీ యూసఫ్, గిరిజన సహకార సంస్థ జిల్లా మేనేజర్ పార్వతీశ్వరరావు, వెలుగు ఏపీడీ శ్రీనివాసరావు, ఏడీఎంహెచ్ఓ అనూష, పీహెచ్ఓ చిట్టిబాబు, మత్స్య అభివృద్ధి అధికారి రమేష్, సీడీపీఓ సంధ్యారాణి, ఆర్అండ్బీ డీఈ సాయిసతీష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిధోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్