తాడిని తరలించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం
అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో గ్రామస్థులంతా కలిసి మూకుమ్మడిగా సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు(తెదేపా, వైకాపా, జనసేన, సీఐటీయూ) తేల్చి చెప్పారు.
ముక్తకంఠంతో హెచ్చరించిన అఖిలపక్ష నాయకులు
మాట్లాడుతున్న అఖిలపక్ష నాయకులు
పరవాడ, న్యూస్టుడే: అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో గ్రామస్థులంతా కలిసి మూకుమ్మడిగా సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు(తెదేపా, వైకాపా, జనసేన, సీఐటీయూ) తేల్చి చెప్పారు. తాడి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీరు మాట్లాడారు. తాడి గ్రామానికి ఆనుకుని ఫార్మాసిటీ రావడంతో 15 ఏళ్లుగా భరించలేని దుర్వాసనతో పాటు శ్వాసకోశ, చర్మ, గుండె, కిడ్నీ రోగాలబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల నుంచి విషవాయువులు లీకైనా, అగ్ని ప్రమాదాలు సంభవించినా భయాందోళనతో పరుగులు తీయాల్సి వస్తోందన్నారు. గత 15 ఏళ్లలో 3 ప్రభుత్వాలు మారినా తమ గ్రామాన్ని తర¢లించకుండా మోసం చేశాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా 28 ఏప్రిల్ 2022న సబ్బవరం వచ్చి పది రోజుల్లో తాడి గ్రామాన్ని తరలిస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. గ్రామానికి ఆనుకుని ఉన్న గ్రీన్బెల్ట్ స్థలంలో రాంకీ యాజమాన్యం రెండు వారాలుగా అక్రమంగా పైపులైన్ నిర్మాణ పనులు చేపడుతోందని వాటిని అడ్డుకుంటే పోలీసులతో కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఈ పైపులైన్ వలన మరింత కాలుష్యం పెరుగుతోందన్నారు. రాంకీ ఛైర్మన్ అయోధ్యరామిరెడ్డి రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పీసీబీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు కావడంతో ఇష్టానుసారంగా చట్టాలను ఉల్లంఘించి ఈ ప్రాంతాన్ని తీవ్ర కాలుష్యమయం చేస్తున్నారని ఆరోపించారు. తాడి గ్రామాన్ని తరలించడానికి జిల్లా ఉన్నతాధికారులు త్వరితగతిన స్పష్టమైన ప్రకటన చేయాలని లేకుంటే గ్రామస్థులంతా కలిసి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేసి కలెక్టర్కు అందిస్తామన్నారు.. అఖిలపక్ష నాయకులు మాదంశెట్టి నీలబాబు, బొడ్డపల్లి అప్పారావు, ఎస్.నదియా, గనిరెడ్డి కనకరాజు, గనిశెట్టి సత్యనారాయణ, కోమటి కులదీప్రాజు, దానబోయిన నీలకంఠరావు, బంతికోరు గోవింద్, మాదంశెట్టి బుజ్జి, జుత్తుక మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం