logo

దాహార్తి తీర్చండి...

తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్‌ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 29 Mar 2024 02:59 IST

 జడ్డంగిలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన
రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్‌ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా ఖాళీ బిందెలతో గురువారం నిరసన తెలిపారు. గిరిజన నాయకుడు తెడ్ల రాంబాబు మాట్లాడుతూ చైతన్యనగర్‌లోని రెండు విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లలో ఒకటి మరమ్మతులకు గురైనా అధికారులు బాగు చేయడంలేదన్నారు. ఒకే ట్రాన్స్‌ఫార్మర్‌పై గృహ కనెక్షన్లతోపాటు నీటి పథకం మోటారు పనిచేస్తుండటంతో లోవోల్టేజీ, తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుచేయాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పది రోజులైనా పట్టించుకోలేదని వాపోయారు. చేతి పంపుల నుంచి సక్రమంగా నీరు రావడం లేదని, వేసవి కావడంతో తాగునీటికి చాలా ఇబ్బందిపడుతున్నామన్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి సమస్యను పరిష్కరించాలని కోరారు. బేబీ, మధురవాణి, దుర్గాదేవి, నారాయణమ్మ, మంగ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.దాహార్తి తీర్చండి...

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని