మే నెలలో ప‘రేషన్’ తప్పదా..!
మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు.
మూడో వంతు డిపోలకు చేరని సరకులు
సరఫరాకు ససేమిరా అంటున్న హమాలీలు
ఎండీయూ వాహనం వద్ద కార్డుదారులు
విశాఖపట్నం, న్యూస్టుడే: మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. పౌరసరఫరాల సంస్థ (సీఎస్సీ) రాష్ట్ర అధికారులు తీసుకున్న నిర్ణయం దీనికి కారణమైంది. నగర పరిధిలో రేషన్ డిపోలకు సరకులు చేరవేసేందుకు మర్రిపాలెంలో డిపో-1, డిపో-2 రెండు గోదాములు ఉన్నాయి. గోదాము-1 పరిధిలోని రేషన్ డిపోలకు సరకుల చేరవేతకు క్వింటాలుకు రూ.21 వరకు సీఎస్సీ ఖర్చు చేస్తోంది. గోదాము-2 పరిధిలోని వాటికి రూ.30 వరకు ఖర్చు చేస్తోంది.
- రవాణా ఖర్చులను తగ్గించే క్రమంలో గోదాము-2 పరిధిలోని చౌక డిపోలను గోదాము-1కు, మధురవాడ తదితర ప్రాంతాల్లోని వాటిని భీమునిపట్నం గోదాముకు కేటాయించారు. గోదాము-2 నుంచి 100కుపైగా రేషను డిపోలు వీడిపోవడంతో అక్కడ పనిచేస్తున్న హమాలీలు ఆదాయం కోల్పోయారు. దీంతో వారు భీమునిపట్నం గోదాముకు వెళ్లిన 25 చౌక డిపోల్లో సరకును ఎట్టి పరిస్థితిలో లోడింగ్, అన్లోడింగ్ చేయరాదని డిమాండ్ చేస్తూ అక్కడి పనులను అడ్డుకున్నారు. మరో పక్క గోదాము-1 పరిధిలో రేషను డిపోలు పెరగడంతో వాటిల్లో అధిక శాతానికి సరకులు చేరలేదు.
- జిల్లా వ్యాప్తంగా 600 డిపోలుంటే ప్రస్తుతం 400 డిపోలకు మాత్రమే సరకులు చేరాయి. ఒక్క రోజే గడువు ఉంది. దీంతో ఈనెల 1వ తేదీన తక్కువ మందికి రేషన్ అందే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
సైబర్ మాయగాళ్ల ఉచ్చులో నగర యువత
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
రంపచోడవరంలో పుష్ప-2 చిత్రీకరణ
[ 19-05-2024]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప-2 సినిమాను శనివారం రంపచోడవరం మార్కెట్లో చిత్రీకరించారు. -
జడిగుడ జలజలా.. జోలాపుట్టు వెలవెల!
[ 19-05-2024]
ముంచంగిపుట్టు మండలంలోని బాబుసాల పంచాయతీ జడిగుడ సమీపంలో జలపాతం మండువేసవిలోనూ జాలువారుతూ కళకళలాడుతోంది. -
ఆన్లైన్లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
[ 19-05-2024]
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో చేపట్టనున్నారు. -
సరిహద్దులు దాటని అభివృద్ధి
[ 19-05-2024]
ఓట్ల పండగ ముగిసి త్వరలో రానున్న ప్రభుత్వం పగ్గాలు అందుకోబోతోంది. -
ప్రాణాంతక వ్యాధులపై ఇంటింటి సర్వే
[ 19-05-2024]
ప్రాణాంతక వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
ఆసక్తికరం.. 1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.