ఓటేయాలంటే పాట్లెన్నో..!
ఏళ్లు గడుస్తున్నా మన్యంవాసులకు రవాణా కష్టాలు గట్టెక్కడం లేదు. పాడేరు డివిజన్ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నేటికీ ఓటేయాలంటే కిలోమీటర్ల దూరం నడక సాగించాల్సిన పరిస్థితి ఉంది.
మన్యంలో తప్పని రవాణా కష్టాలు
రహదారి లేని కారణంగా బరువులు మోసుకెళ్తున్న గిరిజనులు
అనంతగిరి, కొయ్యూరు, న్యూస్టుడే: ఏళ్లు గడుస్తున్నా మన్యంవాసులకు రవాణా కష్టాలు గట్టెక్కడం లేదు. పాడేరు డివిజన్ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నేటికీ ఓటేయాలంటే కిలోమీటర్ల దూరం నడక సాగించాల్సిన పరిస్థితి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా మారుమూల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను మారుస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కుకుంటూ కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఓటేయాల్సిన పరిస్థితి నెలకొంది. మన్యంప్రాంతంలో నేటికీ కనీసం ద్విచక్ర వాహనం వెళ్లలేని గ్రామాలు అనేకం ఉన్నాయి.. పాడేరు డివిజన్ పరిధిలో 244 పంచాయతీలు ఉండగా.. సుమారు 3800 గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1600 మారుమూలన, సుమారు 900 అత్యంత మారుమూలన ఉన్నాయి.
- కొయ్యూరు మండలంలో మొత్తం 56 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందులో 413 మంది ఓటర్లున్న పెదలంక కొత్తూరు (82) పోలింగ్ కేంద్రాన్ని, 664 మంది ఓటర్లున్న రేవులకోట బూత్(80)ను ఈసారి పలకజీడిలో ఏర్పాటు చేస్తున్నారు. 664 మంది ఓటర్లున్న కన్నవరం (70వ) పోలింగ్ కేంద్రాన్ని గరిమండకు, 954 మంది ఓటర్లున్న కునుకూరు(70వ) బూత్ను బాలరేవులకు మారుస్తున్నారు. ఆయా మారుమూల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూ పోలింగ్ కేంద్రానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది.
హామీలు నీటి మూటలే... గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఎన్నికల వేళ హామీలు గుప్పిస్తున్న నాయకులు అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ కనీసం ద్విచక్రవాహనాలు సైతం చేరుకోలేని గ్రామాలు అనేకం ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, గర్భిణులను డోలీమోతతో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి రవాణా సదుపాయం మెరుగుపర్చాలని కోరుతున్నారు.
- పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ పరిధిలోని బొడ్డాపుట్టు, సరిపుట్టు, కందులగుంట, కిండలంలుక్ తదితర గ్రామాల ప్రజలు కుంతుర్లలో పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి. ఈ గ్రామాలకు రహదారి సౌకర్యం లేని కారణంగా సుమారు 8 కిలోమీటర్లు నడవాలి.
- ముంచంగిపుట్టు మండలం బుంగాపుట్టు పంచాయతీ పరిధిలో సుమారు 15 గ్రామాలు ఉన్నాయి. వీరంతా ఓటేసేందుకు లక్ష్మీపురం వెళ్లాలి. ఇందులో సుమారు 10 గ్రామాల ప్రజలు కనీసం 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం కాళ్లకు పనిచెబితేనే ఓటేసే అవకాశం ఉంటుంది.
- అనంతగిరి మండలం పెదకోట, పినకోట పంచాయతీల పరిధిలోని పందిరిమామిడి, నక్కులమామిడి, రాచకీలం, గుమ్మ పంచాయతీ పరిధిలో కడరేవు, రొంపల్లి పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాల ప్రజలు ఓటేయాలంటే కనీసం 10 కిలోమీటర్లు నడవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సికెల్సెల్ ఎనీమియాతో గిరి యువతి మృతి
[ 18-05-2024]
సికెల్సెల్ ఎనీమియాతో గిరిజన యువతి మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యులు అందించిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం మారుమూల బలపం పంచాయతీ తూరుమామిడి గ్రామానికి చెందిన కోరాబు భూమిక (18) పాడేరు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. -
కర్షకుల కడగండ్లు కనిపించవా ?
[ 18-05-2024]
పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలోని రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయకట్టు పరిధిలో ఉన్నా సాగునీటికి కటకట తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాలనీల్లోనే ఉంటున్నారా?
[ 18-05-2024]
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట లబ్ధిదారులు నివాసం ఉంటున్నారా లేదా అన్నది ఆరా తీయాలని గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. -
వెంకన్న కల్యాణోత్సవాలపై సందిగ్ధం
[ 18-05-2024]
అరకులోయ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఆలయ, ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు స్వామివారి కల్యాణోత్సవాలు శనివారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో