అయిదేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులేవీ?
రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
మాట్లాడుతున్న దేవినేని ఉమా
గొల్లపూడి, న్యూస్టుడే: రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేస్తే సొంత కుటుంబాలకు అన్యాయం చేసినట్టేనని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేస్తారన్నారు. జగన్ ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి రూ.లక్షల కోట్లు దోచుకున్నారని వెల్లడించారు. అడ్డగోలుగా ఐరన్ ఓర్, బైరైటీస్, బొగ్గు గనులను అస్మదీయులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి హంద్రీ-నీవా నీరు తెచ్చినట్లు సినిమా సెట్టింగ్లా గేట్లు పెట్టిన ముఖ్యమంత్రి బటన్ నొక్కి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు