పోస్టల్ బ్యాలట్ వినియోగంలో సమాచార లోపం
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
మచిలీపట్నం వచ్చి ఇబ్బందిపడిన ఉద్యోగులు
పాండురంగస్కూల్ వద్ద ముందస్తు ఇచ్చిన సమాచార పత్రాలను చూపిస్తూ..
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బందికి ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే సౌలభ్యం కల్పించారు. అందుకు అనుగుణంగా శనివారం కృష్ణా జిల్లాలోని పీవోలు, ఏపీవోలు, మైక్రో అబ్జర్వర్లు, 5న ఓపీవోలు, 6న పోలీస్ సిబ్బంది, ఎసెన్షియల్ సర్వీసెస్, డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు తదితరులకు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునేందుకు వీలుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీరితో పాటు పొరుగు జిల్లాల్లో ఓటు హక్కు ఉండి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మచిలీపట్నం చిలకలపూడి పాండురంగస్వామి మున్సిపల్ కార్పారేషన్లో ఫెసిలిటేషన్ కేంద్రం పెట్టారు. తొలుత వీరికి పోస్టల్ బ్యాలట్ సౌకర్యాన్ని ఈనెల 4వ తేదీన వినియోగించుకోవాలని సమాచారం ఇచ్చారు. అనంతరం ఆ తేదీని ఈనెల 6కు మార్చి... ఆ సమచారాన్ని సకాలంలో సంబంధిత సిబ్బందికి తెలియజేయలేదు. దీంతో ముందస్తు ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఉద్యోగులు శనివారం పాండురంగ పాఠశాలకు రాగా ఫెసిలిటేషన్ కేంద్రం మూసివేసి ఉంది. దీంతో ఆరా తీసిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీని 6కు మార్చినట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేదీ మార్పుపై తమకు కనీస సమాచారం ఇవ్వని సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. ఈ విషయంపై కొందరు ఉద్యోగులు నోడల్ అధికారి షాహిద్బాబుతో ఫోన్లో మాట్లాడగా తాము ముందుగానే సమాచారం ఇవ్వడమే కాకుండా, తేదీ మార్పును అర్హులకు తెలియచేయాలంటూ ఆర్వోలను కూడా కోరినట్లు చెప్పారు. నోడల్ అధికారితో మాట్లాడిన అనంతరం ఉద్యోగుల సెల్ఫోన్లకు తేదీ మార్పుకు సంబంధించి సంక్షిప్త సందేశాలు రావడం గమనార్హం. దీంతో చేసేది ఏమీలేక ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వడంలో అలసత్వం చూపిన అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఉద్యోగులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?
[ 18-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నదీ గర్భాన్ని.. గత ఐదేళ్లలో వైకాపా నేతలు తోడేళ్లలా తోడేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇసుకాసురులకు అడ్డుకట్ట పడలేదు. -
తెదేపాకు ఓటేశామని.. ఉపాధి పనులు నిలిపివేశారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటేశారని వైకాపా నాయకులు ఇద్దరు కూలీలకు ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. -
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
[ 18-05-2024]
‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది. -
ముంచెత్తిన వర్షం
[ 18-05-2024]
జిల్లాను వర్షం ముంచెత్తింది. శుక్రవారం ఉదయం 4గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రహదార్లు జలమయమయ్యాయి. -
మరమ్మతులు మమ.. అభివృద్ధి భ్రమ
[ 18-05-2024]
కూచిపూడి నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మస్థలమైన భట్లపెనుమర్రు వరకు రహదారికి తూ..తూ.. మంత్రంగా మరమ్మతులు చేశారు. -
అరటి రైతు విలవిల
[ 18-05-2024]
అరటి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న గాలి, వానకు చెట్లు భారీగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. -
ఎన్నికల్లో జోగి అక్రమాలకు అడ్డేది?
[ 18-05-2024]
‘ఎన్నికల ఫలిలతాల తర్వాత జోగి రమేష్ పెనమలూరులో కనిపించర’ ని పెనమలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ విమర్శించారు. -
వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం తగదు
[ 18-05-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లింపుల్లో వ్యత్యాసాలు నెలకొన్నాయని, వాటిని సవరించి చెల్లించడంతో పాటు, ఎన్నికల విధులు, శిక్షణ కాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, సుందరయ్య, కోశాధికారి పి.నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్ డిల్లీరావును కోరారు -
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారం
[ 18-05-2024]
ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
ట్రాఫిక్ పనులకు రెడ్ సిగ్నల్!
[ 18-05-2024]
విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని భావించిన ఐటీఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్) ప్రాజెక్టు ఎంతకూ పూర్తి కావడం లేదు. -
జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు సన్నాహాలు
[ 18-05-2024]
ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు సంకేతాలు అందడంతో, జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు