వైకాపాకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది
పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు.
సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు గుర్నాథం
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్టుడే: పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. మచిలీపట్నం ఈశ్వర్ రెసిడెన్సీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి కుట్రలు తెలుసుకోలేక బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యాన నాలుగు సంవత్సరాల పాటు రాజధాని వికేంద్రీకరణ కోసం ఉద్యమించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. సజ్జల రామకృష్ణారెడి, తలశిల రఘురాం, కొడాలి నాని, నందిగం సురేష్ తదితరుల కనుసన్నల్లో రాజధాని ప్రాంతంలో ఒక అరాచక వాతావరణాన్ని సృష్టించారన్నారు. తాము చేపట్టిన ఉద్యమం మాటున రోజు వారీ రూ.400 కోట్లు విలువ చేసే ఇసుకను దోచేశారనీ, జగన్ నిజస్వరూపం తెలియడంతో మూడు రాజధానుల కుట్ర, పెత్తందారులు.. పేదలు అన్న ప్రచారంలో డొల్లతనాన్ని ప్రజలకు తెలియజేసే క్రమంలో చేపట్టిన బహుజన రాజకీయ చైతన్య యాత్రలో భాగంగా మచిలీపట్నం వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని జగన్ తొక్కేస్తే, మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధిని పేర్ని నాని హరించివేశారన్నారు. బందరు పోర్టును మసిపూసి మారేడుకాయలా తయారు చేశారని, మళ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసగించి రాజకీయ లబ్ధి పొందేందుకు ఏవో పనులు చేస్తున్నట్లు నాటకానికి తెరతీశారని ఆరోపించారు. మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వాటి పట్ల పరిపూర్ణ అవగాహన ఉన్న కూటమి అభ్యర్థులు కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరికి అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు సంవత్సరాల పాటు అతి సన్నిహితంగా మెలగడం వల్ల జగన్ కుట్రలు, అరాచకాలు, అన్నీ తమకు తెలిశాయని, ప్రస్తుత పరిస్థితులో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయాల్సిన గురుతర బాధ్యత అన్ని వర్గాలపై ఉందన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మళ్లీ మోసపోకుండా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తెదేపా నాయకులు డా.ఎస్.విశ్వనాథం, ఎం.అబీద్హుస్సేన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకిల్ సవారీ.. వేస్తారా దారి?
[ 19-05-2024]
విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. -
పెట్టుబడి అంటే.. పట్టుబడినట్టే..!
[ 19-05-2024]
విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు. -
విజ్ఞానం.. వినోదం
[ 19-05-2024]
తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. -
ఈసారీ అదే తంతు..?
[ 19-05-2024]
పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు. -
చిలకలపూడి స్టేషన్లో సమస్యల కూత
[ 19-05-2024]
మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్తో పాటు చిలకలపూడి స్టేషన్లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్గోల్డ్ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఈ స్టేషన్నే ఆశ్రయిస్తారు. -
భక్తితో వాసవీ మాత జయంతి
[ 19-05-2024]
నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. -
కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం
[ 19-05-2024]
పెడన నియోజకవర్గంలో ఉన్న ఏకైక బంటుమిల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అమడ దూరంలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనిని 1997లో ప్రారంభించారు. -
నీ పరుగులేవమ్మ ... కృష్ణమ్మా..
[ 19-05-2024]
కృష్ణానది నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు లేకపోవడంతో నీటిమట్టం పడిపోతోంది. -
నీరుగారిన చెత్త నిర్వహణ
[ 19-05-2024]
మండల పరిధిలోని చెత్త నిర్వహణ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షలు వ్యయంతో నిర్మించిన కేంద్రాలను వినియోగించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రహదారుల వెంట చెత్త ఇష్టానుసారం పడేస్తున్నారు. 24 గ్రామాల్లో ఏడేళ్లనాడు చెత్త కేంద్రాలు నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!