నా ఎస్సీ, నా ఎస్టీ.. నా బీసీలంటూనే దాడులు
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని... నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే వారిపై వైకాపా నేతలే దాడులకు తెగబడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.
వైకాపా సర్కారు తీరుపై బొండా ధ్వజం
విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్టుడే : జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని... నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే వారిపై వైకాపా నేతలే దాడులకు తెగబడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. అజిత్సింగ్నగర్లో జగన్పై గులకరాయి దాడి కేసులో అమాయకులైన బీసీలను వేధించి.. వేముల సతీష్కుమార్పై అక్రమంగా కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పోస్టల్ బ్యాలట్ ఓటుకు డబ్బు తీసుకోలేదని ఎస్టీ ఉద్యోగిపై వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని దుయ్యపట్టారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తెదేపా నాయకులపై దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరుగుతున్నా.. చర్యలు తీసుకోలేదని దుయ్యపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీ అయిపోయిందని విమర్శలు గుప్పించారు. తన ఇంటిపై వైకాపా మూక దాడి చేసి కొట్టారని మనోజ్కుమార్ ఫిర్యాదు చేసినా స్పందించలేదని, అదే మనోజ్కుమార్పై ఎస్సీ మహిళతో ఫిర్యాదు చేయించి ఆగమేఘాల మీద కేసు కట్టారని.. పోలీసుల తీరును దుయ్యపట్టారు. గులకరాయి కేసులో చిన్న దెబ్బకే బీసీల పిల్లలపై 307 హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. దళిత ఉద్యోగి ఇంటిపై మూకుమ్మడి దాడి చేసి కులం పేరుతో తిట్టి దారుణంగా కొట్టినా కేసు నమోదు చేసేందుకు తాత్సారం చేశారన్నారు. వైద్య పరీక్షల పేరుతో రాత్రంతా రోడ్లపై తిప్పి, కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేశారని మండిపడ్డారు. నిందితులు మోదుగుల గణేష్, ఇతరులకు పోలీస్స్టేషన్లో మర్యాదలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఉమా డిమాండ్ చేశారు. నార్త్ ఏసీపీ డి.ఎన్.వి.ప్రసాద్, నున్న సీఐ దుర్గాప్రసాద్లు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, తమకు పోస్టింగ్లు ఇచ్చింది వెలంపల్లి అంటూ స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 14న వీరిపై ఎన్నికల సంఘానికి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో నవనీతం సాంబశివరావు, వీరమాచినేని కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకిల్ సవారీ.. వేస్తారా దారి?
[ 19-05-2024]
విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. -
పెట్టుబడి అంటే.. పట్టుబడినట్టే..!
[ 19-05-2024]
విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు. -
విజ్ఞానం.. వినోదం
[ 19-05-2024]
తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. -
ఈసారీ అదే తంతు..?
[ 19-05-2024]
పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు. -
చిలకలపూడి స్టేషన్లో సమస్యల కూత
[ 19-05-2024]
మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్తో పాటు చిలకలపూడి స్టేషన్లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్గోల్డ్ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఈ స్టేషన్నే ఆశ్రయిస్తారు. -
భక్తితో వాసవీ మాత జయంతి
[ 19-05-2024]
నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. -
కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం
[ 19-05-2024]
పెడన నియోజకవర్గంలో ఉన్న ఏకైక బంటుమిల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అమడ దూరంలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనిని 1997లో ప్రారంభించారు. -
నీ పరుగులేవమ్మ ... కృష్ణమ్మా..
[ 19-05-2024]
కృష్ణానది నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు లేకపోవడంతో నీటిమట్టం పడిపోతోంది. -
నీరుగారిన చెత్త నిర్వహణ
[ 19-05-2024]
మండల పరిధిలోని చెత్త నిర్వహణ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షలు వ్యయంతో నిర్మించిన కేంద్రాలను వినియోగించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రహదారుల వెంట చెత్త ఇష్టానుసారం పడేస్తున్నారు. 24 గ్రామాల్లో ఏడేళ్లనాడు చెత్త కేంద్రాలు నిర్మించారు.