మూడు వంతెనలన్నారు.. రైతులను ముంచారు
కృత్తివెన్ను మండలంలోని పెదలంక డ్రైయిన్కు రూ.40కోట్లు, పడతడిక-చినగొల్లపాలెం మధ్యగల కొత్తకాలువకు రూ.136.6కోట్లు, ఏటిమొండిపల్లెపాలెం-మోళ్లపర్రు మధ్యగల ఉప్పుటేరుకు రూ.188.4కోట్ల నిధులతో మొత్తం మూడు రెగ్యులేటర్ కం బ్రిడ్జిలకు రూ.365 కోట్లు నిధులు సీఎం జగన్ మంజూరు చేసినట్లు మంత్రి జోగి రమేష్ ప్రజలను మోసం చేశారు.
హామీ ఇచ్చి చేతులెత్తేసిన మంత్రి జోగి రమేష్
కృత్తివెన్ను, న్యూస్టుడే
కృత్తివెన్ను మండలంలోని పెదలంక డ్రైయిన్పైనా, చినగొల్లపాలెం-పడతడిక మధ్యగల కొత్తకాలువ, రెండు జిల్లాల సరిహద్దు ఉప్పుటేరుపై రూ.365కోట్లతో మూడు రెగ్యులేటర్ కంబ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేస్తా
- మంత్రి జోగి రమేష్ ఇచ్చిన హామీ
నిరాశపడిన రైతులు
మంత్రి ఇచ్చిన హామీతో రైతులు ఎంతో సంతోషించారు. తమ కష్టాలు తీరతాయని ఆశపడ్డారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. నిధులు మంజూరయ్యాయని ప్రజలను నమ్మించిన ఆయన ఆ తరువాత ఆ విషయాన్నే మరిచిపోయారు. కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. తన పదవీకాలంలో ఒక్క వంతెన కూడా నిర్మించలేదు.. ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేదు.
కృత్తివెన్ను మండలంలోని పెదలంక డ్రైయిన్కు రూ.40కోట్లు, పడతడిక-చినగొల్లపాలెం మధ్యగల కొత్తకాలువకు రూ.136.6కోట్లు, ఏటిమొండిపల్లెపాలెం-మోళ్లపర్రు మధ్యగల ఉప్పుటేరుకు రూ.188.4కోట్ల నిధులతో మొత్తం మూడు రెగ్యులేటర్ కం బ్రిడ్జిలకు రూ.365 కోట్లు నిధులు సీఎం జగన్ మంజూరు చేసినట్లు మంత్రి జోగి రమేష్ ప్రజలను మోసం చేశారు. ఇది చెప్పిన రెండేళ్లవరకు ఆయన పత్తాలేరు. రైతులు ఈ విషయాన్ని నిలదీయడంతో మోళ్లర్రు,కొత్తకాలువలపై రెగ్యులేటర్ల నిర్మాణానికి నిధులు సరిపోవని, అందుకే అంచనాలు పెంచి పంపామని అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని మరోసారి నమ్మించారు. మండలానికి వచ్చిన ప్రతిసారీ అన్నదాతలు నిలదీయడంతో ఈ విషయం సీఎం దృష్టిలో ఉందని,త్వరలో పనులు చేపడతామని నమ్మించి చివరకు పెనమలూరుకు జారుకున్నారని ఆరోపించారు. రెండో పంటకు సాగునీరు ఎలాగు ఇవ్వలేదు. కనీసం వీటిని నిర్మించిటన్లయితే మళ్లీ సార్వా పంట నాటికి భూములన్నీ సముద్రపు ఉప్పునీరు పోటుకు గురికాకుండా ఉండేవని రైతులు అంటున్నారు.
భూములు చౌడుబారాయి
-బొమ్మిడి బాలకృష్ణ, గరిశపూడి, ఆక్వారైతు
పెదలంక డ్రెయిన్పై రెగ్యులేటర్ నిర్మించకపోవడంతో ఆక్వా రైతులందరమూ ఇబ్బందులు పడుతున్నాం. సుమారు 400మందికి చెందిన సుమారు వెయ్యి ఎకరాలు చౌడుబారాయి.రెండో పంటకు ప్రభుత్వం నీరు ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో ఈ రెగ్యులేటర్ నిర్మిస్తే చాలామంది రైతులకు మేలు జరిగేది. పాలకులు ఈ విషయాన్ని విస్మరించారు.
ఉసూరుమనిపించారు
-తమ్ము మురళీకృష్ణ బొడ్డు నారాయణమూర్తి, రైతులు
పడతడిక-చినగొల్లపాలెం మధ్య ఉన్న కొత్తకాలువపై రెగ్యులేటర్ నిర్మిస్తామని చెప్పిన మంత్రి జోగి రమేష్ మమ్మల్ని ఉసూరుమనిపించారు. దాన్ని నిర్మించడం వల్ల మాకు 10నెలల పాటు మంచినీరు అందుబాటులో ఉంటుంది. ఆక్వాసాగుకు ఇబ్బంది ఉండదు. ఈ రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల గ్రామాల్లోని సుమారు 4వేల ఎకరాల్లో ఆక్వాసాగు చేపట్టిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకిల్ సవారీ.. వేస్తారా దారి?
[ 19-05-2024]
విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. -
పెట్టుబడి అంటే.. పట్టుబడినట్టే..!
[ 19-05-2024]
విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు. -
విజ్ఞానం.. వినోదం
[ 19-05-2024]
తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. -
ఈసారీ అదే తంతు..?
[ 19-05-2024]
పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు. -
చిలకలపూడి స్టేషన్లో సమస్యల కూత
[ 19-05-2024]
మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్తో పాటు చిలకలపూడి స్టేషన్లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్గోల్డ్ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఈ స్టేషన్నే ఆశ్రయిస్తారు. -
భక్తితో వాసవీ మాత జయంతి
[ 19-05-2024]
నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. -
కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం
[ 19-05-2024]
పెడన నియోజకవర్గంలో ఉన్న ఏకైక బంటుమిల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అమడ దూరంలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనిని 1997లో ప్రారంభించారు. -
నీ పరుగులేవమ్మ ... కృష్ణమ్మా..
[ 19-05-2024]
కృష్ణానది నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు లేకపోవడంతో నీటిమట్టం పడిపోతోంది. -
నీరుగారిన చెత్త నిర్వహణ
[ 19-05-2024]
మండల పరిధిలోని చెత్త నిర్వహణ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షలు వ్యయంతో నిర్మించిన కేంద్రాలను వినియోగించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రహదారుల వెంట చెత్త ఇష్టానుసారం పడేస్తున్నారు. 24 గ్రామాల్లో ఏడేళ్లనాడు చెత్త కేంద్రాలు నిర్మించారు.