ప్రధాని రోడ్ షోలో అప్రమత్తంగా ఉండండి
ప్రధాన మంత్రి రోడ్ షోలో విధులు నిర్వహించే ప్రతీ అధికారి అంకితభావంతో పని చేయాలని నగర పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ అన్నారు.
పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు
పోలీసులకు సీపీ దిశానిర్దేశం
కరెన్సీనగర్, న్యూస్టుడే : ప్రధాన మంత్రి రోడ్ షోలో విధులు నిర్వహించే ప్రతీ అధికారి అంకితభావంతో పని చేయాలని నగర పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలోని ఆంధ్రా లయోల కళాశాల దేవయ్య ఆడిటోరియంలో మంగళవారం పోలీస్ అధికారులకు సీపీ దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పర్యవేక్షణ పెంచాలన్నారు. సిబ్బంది వారికి కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. వీక్షకులకు, ఆహ్వానితులకు వారికి కేటాయించిన మార్గాలను తెలియజెప్పాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్కు, ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లాలన్నారు. ప్రధాని రోడ్ షోలో భాగంగా బందోబస్తు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టం చేయాలని, రోడ్ ఓపెనింగ్ పార్టీస్, కట్ ఆఫ్ పార్టీస్, రూఫ్ టాప్స్, రోప్ పార్టీస్, యాంటి సబ్ టేజ్ చెక్... వివిధ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల్లో ఆరుగురు ఐపీఎస్, 7 గురు డీసీపీలు, ఏడీసీపీలు 22 మంది, ఏసీపీలు 50 మంది, ఇన్స్పెక్టర్లు 136 మంది, ఎస్సైలు 250 మంది సిబ్బందితో కలిపి 5 వేల మంది లా అండ్ ఆర్డర్, ఏఆర్., ఏపీఎస్పీ, పారా మిలటరీ బలగాలతో భద్రత పటిష్టంగా ఉండాలన్నారు. ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపాలన్నారు. ఐజీపీ కె.వి.మోహన్రావు, డి.ఐ.జి. గోపినాథ్ జెట్టి, ఎ.ఐ.జి. ఎం.రవీంద్రనాథ్ బాబు, వకుల్ జిందాల్, మల్లికా గార్గ్, దామోదర్, డీసీపీలు శ్రీనివాసరావు, అధిరాజ్ సింగ్ రాణా, ఉదయరాణి, కీరముల్లా, చక్రవర్తి, హరికృష్ణ, బి.రామకృష్ణ ఇతర అధికారులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా
[ 19-05-2024]
విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు. -
సైకిల్ సవారీ.. వేస్తారా దారి?
[ 19-05-2024]
విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. -
విజ్ఞానం.. వినోదం
[ 19-05-2024]
తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. -
ఈసారీ అదే తంతు..?
[ 19-05-2024]
పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు. -
చిలకలపూడి స్టేషన్లో సమస్యల కూత
[ 19-05-2024]
మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్తో పాటు చిలకలపూడి స్టేషన్లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్గోల్డ్ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఈ స్టేషన్నే ఆశ్రయిస్తారు. -
భక్తితో వాసవీ మాత జయంతి
[ 19-05-2024]
నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. -
కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం
[ 19-05-2024]
పెడన నియోజకవర్గంలో ఉన్న ఏకైక బంటుమిల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అమడ దూరంలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనిని 1997లో ప్రారంభించారు. -
నీ పరుగులేవమ్మ ... కృష్ణమ్మా..
[ 19-05-2024]
కృష్ణానది నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు లేకపోవడంతో నీటిమట్టం పడిపోతోంది. -
నీరుగారిన చెత్త నిర్వహణ
[ 19-05-2024]
మండల పరిధిలోని చెత్త నిర్వహణ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షలు వ్యయంతో నిర్మించిన కేంద్రాలను వినియోగించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రహదారుల వెంట చెత్త ఇష్టానుసారం పడేస్తున్నారు. 24 గ్రామాల్లో ఏడేళ్లనాడు చెత్త కేంద్రాలు నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు