ఉద్యాన రైతుల ఊపిరితీస్తున్న జగన్!
రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రధానంగా చీనీ, దానిమ్మ సాగు ఎక్కువ. గత తెదేపా హయాంలో ఆయా పంటల సాగుకు పెద్దఎత్తున ప్రోత్సహించారు.
ఐదేళ్లలో ప్రోత్సాహకాలు కరవు.. అరకొర నిధులు
చీనీ, దానిమ్మ కర్షకుల పరిస్థితి దయనీయం
అనంతపురం (వ్యవసాయం), న్యూస్టుడే: రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రధానంగా చీనీ, దానిమ్మ సాగు ఎక్కువ. గత తెదేపా హయాంలో ఆయా పంటల సాగుకు పెద్దఎత్తున ప్రోత్సహించారు. అప్పట్లో హార్టికల్చర్ హబ్గా పేరొందింది. రాయితీలు, గిట్టుబాటు ధర లభించడంతో ఉద్యాన రైతులు లాభాలు గడించారు. వర్షాభావ పరిస్థితులతో చీనీ, దానిమ్మ తదితర పంటలు ఎండుముఖం పట్టగా రక్షక తడులు అందించి ఆదుకున్నారు. మార్కెట్లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేది. ఐదేళ్ల జగన్ పాలనలో పరిస్థితులు తలకిందులయ్యాయి. ఉద్యాన పథకాలకు నిధులు పూర్తిగా తగ్గించారు. మార్కెటింగ్ సౌకర్యం లేక పంటలు అమ్ముకోలేని దుస్థితి. సాగుకు రూ.లక్షలు వెచ్చించినా పెట్టుబడి దక్కక చీనీ, దానిమ్మ రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు.
ఉమ్మడి అనంత జిల్లాలో చీనీ 1,31,727 ఎకరాల్లో సాగవుతుంది. ఎకరా సాగు ఖర్చు రూ.లక్ష అవుతుంది. 10 టన్నుల దిగుబడి వస్తుంది. గతేడాది వర్షాభావంతో ప్రస్తుతం వేరుకుళ్లు తెగులుతో కాపుకొచ్చిన చీనీ చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో ఎకరాకు 2 నుంచి 3 టన్నుల దిగుబడి తగ్గుతోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎండ వేడిమికి ఎకరాకు 2 నుంచి 3 టన్నుల వరకు తగ్గి నష్టపోవాల్సి వస్తోంది.
బ్యాక్టీరియాతో దానిమ్మకు తీవ్ర నష్టం
ఉమ్మడి జిల్లాలో 18,571 ఎకరాల్లో దానిమ్మ సాగవుతుంది. ఎకరాకు 6 టన్నులు చొప్పున మొత్తం 1,11,426 టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. దానిమ్మ ఎకరా సాగు చేయాలంటే రూ.1.30 లక్షల పెట్టుబడి అవుతుంది. 2022లో బ్యాక్టీరియా తెగులు ఆశించి పంటంతా దెబ్బతింది. ఎకరాకు 1 నుంచి 2 టన్నుల కాయలు నష్టనపోవాల్సి వస్తోందని కర్షకులు ఆందోళన చెందుతున్నారు.
మార్కెట్పై నియంత్రణేదీ?
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చీనీ కోతలు ఊపందుకున్నాయి. అనంత వ్యవసాయ మార్కెట్ యార్డులో రోజుకు రూ.3 కోట్ల వ్యాపారం సాగుతోంది. సంతలో నాలుగు శాతం కమీషన్ గుంజుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు అనంతపురం పర్యటనలో బుక్కరాయసముద్రం మండలం వెన్నపూసపల్లికి చెందిన చీనీ రైతులు సమస్యను ఏకరవు పెట్టారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కమీషన్ను నియంత్రించారు. వైకాపా ప్రభుత్వం రాగానే మళ్లీ దళారుల దందా కొనసాగుతోంది.
రాష్ట్ర ప్రణాళిక పథకం రద్దు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మూడు పథకాలు అమలు చేస్తున్నాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక పథకాన్ని అమలు చేస్తోంది. దీన్ని వైకాపా అధికారంలోకి రాగానే రద్దు చేసింది. అంతకుముందు ఏటా 2వేల మంది రైతులకు రూ.6 కోట్లు మంజూరయ్యేవి. ఈ ప్రకారం ఐదేళ్లలో రూ.30 కోట్లు... పది వేల మంది రైతులకు అందలేదు. తెదేపా హయాంలో సకాలంలో నిధులు మంజూరయ్యేవి. రైతు వాటా చెల్లిస్తే చాలు రాయితీలు అందేవి. వైకాపా పాలనలో ఏ పథకం కిందైనా ముందుగా పూర్తి సొమ్ము చెల్లించాల్సిందే. తర్వాత రాయితీని రైతు ఖాతాలకు జమ చేస్తారు. గతేడాది వివిధ పథకాల కింద రూ.9 కోట్లు మంజూరు చేశారు. రూ.2.94 కోట్లు మాత్రమే లక్ష్యం పూర్తి చేశారు. ఆ సొమ్ము ఇప్పటికీ రైతుల ఖాతాలకు జమ చేయకపోవడం గమనార్హం.
ఆశలు అడుగంటి..
తాడిమర్రి: కునుకుంట్ల గ్రామానికి చెందిన రైతు సదా 12 ఏళ్ల కిందట ఆరెకరాల్లో 800 చీనీ చెట్లు సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చెట్లకు నీరందక ఎండుముఖం పడుతున్నాయి. దీంతో ఇప్పటికే 50కి పైగా చెట్లను తొలగించారు. ప్రభుత్వం నుంచి సాయం కరవైందని రైతు వాపోతున్నారు.
కొరవడిన ప్రోత్సాహం..
బొమ్మనహాళ్: జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో పండ్ల తోటల విస్తరణకు ప్రోత్సాహం, రాయితీలు ఇవ్వకపోవడంతో పెంపకం తగ్గుతోంది. మండలంలోని ఎల్బీ నగర్ జిల్లాలోనే దానిమ్మ తోటల పెంపకానికి ప్రసిద్ధి. ఒకప్పుడు 2,500 ఎకరాల్లో దానిమ్మ సాగు ఉండేది. నేడు 300 ఎకరాలు కూడా లేదు. ప్రోత్సాహం లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. తెదేపా హయాంలో రైతులకు రాయితీతో ఒక్క పండ్ల మొక్క, సేద్యం ఖర్చులు, పవర్ స్ప్రేయర్లు, సూక్ష్మ పోషకాలు, రాయితీపై బిందు సేద్య పరికరాలు, టార్పాలిన్ ఇచ్చేవారు. శీతల గిడ్డంగులు నిర్మించేవారు. వైకాపా ప్రభుత్వం వీటన్నిటికీ మంగళం పాడింది.
ట్యాంకరు నీటిని కొనుగోలు చేసి..
తాడిమర్రి: కునుకుంట్లలో 5 ఏళ్లలో తెగుళ్లు సోకి, నీరు లేక ఎండిపోయిన 30 వేల చీనీమొక్కలను నరికివేశారు. ఇప్పుడు కూడా బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోయి చెట్లు ఎండుతుండటంతో ట్యాంకరుకు రూ.1,000 చెల్లించి రైతులంతా నీటిని కొనుగోలు చేసి చెట్లకు రక్షక తడులు అందిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా 15, 20 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. వందల చెట్లు ఉన్న రైతులు రోజూ ట్యాంకరుకు అంతడబ్బు చెల్లించలేక సొంతంగానే ట్రాక్టర్ను రూ.3 లక్షలకు కొనుగోలు చేసి, తోటలో ఇంకుడు గుంతలు తవ్వించి నీటిని అందులో నింపి మోటార్ల ద్వారా చెట్లకు నీరు పెడుతున్నారు.
ఐదేళ్లుగా నష్టాలే..
పెద్దపప్పూరు: జె.కొత్తపల్లికి చెందిన రైతు నిరంజన్ 5 ఎకరాల్లో ఎకరాకు రూ. 1.50 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టి పంట సాగు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం ఉద్యాన రాయితీలను పూర్తిగా ఆపివేయడంతో పెట్టుబడి అధికమైంది. దీనికితోడు పంటకు తెగుళ్లు చుట్టుముట్టడంతో దిగుబడి తగ్గింది. చేతికి వచ్చిన పంటకు సైతం గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆర్థికంగా దెబ్బతిన్నారు. పంట నష్టపోయినా ప్రభుత్వం పైసా పరిహారం అందించలేదని ఆవేదన చెందుతున్నారు. తెదేపా హయాంలో మట్టి నమూనా పరీక్షలు, బిందుసేద్యం పరికరాలు, యంత్రాలు, రాయితీపై ఎరువులు తదితర ప్రోత్సాహకాలు అందించేవారని, వైకాపా ప్రభుత్వంలో ఉద్యాన రైతులకు ప్రోత్సాహం కరవైందని రైతులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రజాప్రతినిధుల అనుచరులే.. అసురలై
[ 06-05-2024]
నిత్యం మూడు కబ్జాలు, ఆరు ఆక్రమణలతో వైకాపా ప్రజాప్రతినిధులు అవినీతి చక్రవర్తుల్లా మారిపోయారు. మేం తక్కువ తిన్నాం అంటూ వారి అనుచరులు మండలాల్లో అరాచకాలకు పాల్పడుతూ సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు. -
ఉద్యోగులకు ప్రలోభాల ఎర
[ 06-05-2024]
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొనడానికి వైకాపా బరి తెగించింది. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా పోలింగ్ కేంద్రాల (ఫెసిలిటేషన్) వద్దే వైకాపా శ్రేణులు బేరసారాలకు ఒడిగట్టారు. -
ఎన్నికల ముందు హామీలు.. ఆనక నామాలు
[ 06-05-2024]
-
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అనంత అభివృద్ధి
[ 06-05-2024]
వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర మంత్రి అమిత్షా, తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అనంతపురం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. -
గొడవలపై ఉక్కుపాదం మోపండి
[ 06-05-2024]
‘ఎన్నికల నిర్వహణను సవాల్గా తీసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా సాగాలంటే.. గొడవలు, రౌడీలపై ఉక్కుపాదం మోపాలి. శాంతిభద్రల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలి’ అని ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా పేర్కొన్నారు. -
తెదేపా హయాంలో ఏర్పాటు.. వైకాపా పాలనలో గ్రహపాటు
[ 06-05-2024]
సమూల మార్పులతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని గొప్పలు చెబుతున్న వైకాపా ప్రభుత్వం గురుకులాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. -
వైకాపా వ్యతిరేక ఓటును ఆపేందుకు ప్రయత్నం
[ 06-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ ఉద్యోగి ఎక్కడ ఓటు వినియోగించుకోవాలో.. స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. -
ఫాం-12 ఇచ్చాం.. మా పేర్లు ఏమయ్యాయి
[ 06-05-2024]
‘ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఫాం-12 సకాలంలో ఇచ్చాం. మేము పని చేసే చోటే ఆర్ఓలకు సమర్పించాం. ఇపుడు ఓటు వేసేందుకు వస్తే.. పేర్లు లేవంటారు. -
గుంతకల్లు భగభగ
[ 06-05-2024]
ఉమ్మడి జిల్లాలో ఆదివారం గుంతకల్లులో అత్యధికంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు