9 గంటల విద్యుత్తు.. ఎక్కడ జగన్?
మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు.
ఏడు గంటలూ సక్రమంగా ఇవ్వని దుస్థితి
అన్నదాతలను అష్టకష్టాలు పెట్టిన వైకాపా సర్కారు
ఇక నిన్ను నమ్మం పాలకా..
రైతులు రాత్రి పూట పొలానికి వెళ్లి పంటలకు నీరు పెట్టాల్సిన అవసరం లేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పగటిపూటే వ్యవసాయ కనెక్షన్లు అన్నింటికీ నిరంతరాయంగా తొమ్మిది గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తాం.
ప్రతిపక్ష నేతగా పలు సందర్భాల్లో జగన్ ఇచ్చిన హామీ
అనంతపురం (విద్యుత్తు), లేపాక్షి, న్యూస్టుడే: మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు. అన్నదాతలను నిలువునా ముంచేశాడు. మళ్లీ ఓట్లు వేయాలంటూ రోడ్డెక్కి హామీలు గుప్పిస్తున్నాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు జగన్ సర్కారు ఏడు గంటల సరఫరా కూడా ఇవ్వని దయనీయ పరిస్థితి నెలకొంది. రూ.లక్షలు ఖర్చుపెట్టి సాగు చేసిన పంటలకు తడులు అందించకపోవటంతో కళ్లముందే ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు కార్యాలయాలు, ఉపకేంద్రాల ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు. కరెంటు సరఫరా కోసం రైతులు తమ పొలాల్లో రాత్రి పూట పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరఫరాలోనూ అంతరాయాలు కలుగుతుండటంతో కంటికి నిద్ర లేకుండా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. హెచ్చుతగ్గుల సరఫరాతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. మరమ్మతులు చేయించడానికి వ్యయప్రయాసలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు..
విడతల వారీగానే..
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పగటి పూట నిరంతరాయంగా తొమ్మిది గంటల సరఫరా కావడం లేదు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సర్వీసులకు సరఫరా చేస్తున్న ఫీడర్లు 823 ఉండగా...ఒకే విడతలో ఏడు గంటల సరఫరా ఇచ్చినవి 182. దీని ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇచ్చారు. రెండు విడతల్లో 621 ఫీడర్ల పరిధిలో ఉన్న సర్వీసులకు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3గంటల వరకు ఒకసారి... రెండోసారి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6వరకు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 20 ఫీడర్లలో ఉన్న 30 వేల సర్వీసులకు మూడు విడతల్లో విద్యుత్తు ఇస్తున్నారు. వ్యవసాయ సర్వీసులకు రెండు గంటల పాటు కోత పెట్టి.. గృహ, వాణిజ్య, పరిశ్రమలకు అందిస్తున్నారు.
కోతలతో రైతులకు ఉరి
అగళి: మండలంలోని పలు ఫీడర్లలో రైతులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా లేకపోవడంతో బోరుబావుల్లో వచ్చే నీటితో సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. నిత్యం తొమ్మిది గంటల పగటిపూట విద్యుత్తు సరఫరా చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రగల్బాలు పలికింది. ఆచరించకపోవడంతో రైతులకు ఉరితాడైంది. మండలంలో కొమరేపల్లి, కదిరేపల్లి, కంబదపల్లి గ్రామాల్లో నిత్యం రెండు, మూడు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తున్నారని, పంటలు ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు ఇటీవల మధూడి విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ధర్నా చేశారు. ఇప్పటికే సాగు చేసిన 120 ఎకరాల్లో వక్క, మిరప, వేరుసెనగ, పూల తోటలు వాడిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కదిరేపల్లి వద్ద ఎండిపోయిన వక్క తోట
ఉమ్మడి జిల్లాలో ఇలా..
వ్యవసాయ కనెక్షన్లు : 3.10 లక్షలు
అన్ని కేటగిరీల కనెక్షన్లు : 14 లక్షలు
గతేడాది ఏప్రిల్లో విద్యుత్తు వినియోగం: 18.815 మిలియన్ యూనిట్లు
ప్రస్తుత ఏడాది ఏప్రిల్లో వినియోగం : 19.304 మిలియన్ యూనిట్లు
వేరుసెనగ వాడిపోయింది
నేను సాగు చేసిన రెండు ఎకరాల వేరుసెనగ పంటతోపాటు, ఎకరం మిరప పంట పూర్తిగా వాడిపోయింది. నిత్యం ఇష్టానుసారంగా రెండు గంటలు కూడా విద్యుత్తు సరఫరా చేయడం లేదు. ఎండలు తీవ్రంగా ఉండటంతో పంట పూర్తిగా ఎండిపోయింది. దాదాపు రూ.75 వేలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
నాగరాజు, రైతు, కొమరేపల్లి
అన్నీ ఉత్తి మాటలే..
లేపాక్షి: గలిబిపల్లికి చెందిన రాజన్న 3 ఎకరాల పొలంలో మొక్కజొన్న, మల్బరీ సాగు చేస్తున్నారు. ఉదయం 8.15 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సరఫరా ఇస్తున్నారు. ఈ లెక్కన రోజూ 7 గంటలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో పంటలకు నీరు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి. ఖరీఫ్లో మొక్కజొన్న పంటకు నీరుందక పంట దిగుబడి తగ్గిందని రైతు వాపోతున్నారు.
పంటలు ఎండుతున్నాయి
ఓబుళదేవరచెరువు: మండలంలోని కొండకమర్ల పంచాయతీ గంగిరెడ్డిపల్లికి చెందిన జయచంద్రారెడ్డి రెండు ఎకరాల్లో వరిపంటను సాగుచేశారు. మందులు, ఎరువులకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టారు. రోజుకు 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తేనే పంటకు నీరు అందుతుంది. ప్రభుత్వం పగటి పూటే 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తామని చెప్పినా ఎక్కడా అమలు కాలేదు. పగలు 4, రాత్రి 3 గంటలు మొత్తం కలిపి 7 గంటలే సరఫరా చేస్తున్నారు. అందులోనూ కోతలు విధిస్తుండటంతో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తక్కువ సమయం కరెంటు సరఫరా చేయడంతో పంటకు పూర్తిగా నీరు అందక ఎండు ముఖం పడుతోంది. జగన్ ప్రభుత్వం తమను ఆదుకోలేకపోయిందని రైతు వాపోయారు. వేలకు వేలకు పెట్టుబడి పెట్టి విద్యుత్తు కోతలతో సకాలంలో పంటకు నీరందక నష్టపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
[ 18-05-2024]
‘శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేసిన రామకృష్ణారెడ్డి.. అధికారిక వాహనాలను (కార్లు) సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు విహారయాత్రలకు రెక్టార్, రిజిస్ట్రార్లకు కేటాయించిన కార్లను వాడుకున్నారు. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
[ 18-05-2024]
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఇసుకాసురుల ఆగడాలు ఆగేనా?
[ 18-05-2024]
ఐదేళ్లపాటు ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. నిబంధనలను లెక్కచేయకుండా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. అధికారం వారి చేతుల్లో ఉండటంతో అధికారులు సైతం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. -
అంతా.. నిశ్శబ్దం
[ 18-05-2024]
ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లతో రాష్ట్రంలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన తాడిపత్రిలో నిశబ్ద వాతావరణం నెలకొంది. తాడిపత్రి పట్టణ వాసులకు వైకాపా మూకల అరాచక పర్వాన్ని గుర్తు చేసుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతోంది. -
ఉత్తర మండలాల్లో మోస్తరు వర్షం
[ 18-05-2024]
జిల్లాలోని ఉత్తర మండలాల్లో గురువారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. డి.హీరేహాళ్ మండలంలో 28.8 మి.మీలు అత్యధికంగా వర్షం కురిసింది. -
ఓటర్ల ఓపికకు పరీక్ష
[ 18-05-2024]
సగటున ఒక నిమిషంలోపే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు చెరొక ఓటు వేసే వీలున్నా.. గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓటర్ల సహనానికి, ఓపికగా ఎన్నికల సంఘం పరీక్ష పెట్టింది. -
విద్యుత్తు నియంత్రికల మంజూరులో కీలక అధికారి తీరే వేరప్పా..
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లా విద్యుత్తుశాఖలో ఓ కీలక అధికారి అధికార పార్టీ తొత్తుగా మారిపోయారు. వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తే చాలు.. వెంటనే విద్యుత్తు నియంత్రికలు మంజూరు చేసి తన విధేయతను చాటుకుంటున్నారు.రెండేళ్లలో 300 పైగా 25కేవీ సామర్థ్యంగల నియంత్రికలు మంజూరు చేశారంటే ఆయన వైకాపా నేతలతో ఎంత అంటకాగారో అర్థం చేసుకోవచ్చు. -
బీఎల్ఓలకు రిక్తహస్తం!
[ 18-05-2024]
బూత్ స్థాయి అధికారులపై(బీఎల్ఓ) ఎన్నికల అధికారులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. పని చేయించుకుని పైసా పారితోషకం ఇవ్వడం లేదు. ఓటరు జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఇంటింటా సర్వే.. ఇలా అనేక కీలక పనులు చేస్తున్న బీఎల్ఓల పట్ల కనికరం చూపడం లేదు. -
అవసరమైతేనే సిజేరియన్ చేయండి
[ 18-05-2024]
పలు ఆసుపత్రుల్లో గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారని, అవసరమైతే తప్ప చేయకూడదని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.బి.దేవి తెలిపారు. శుక్రవారం అనంతపురంలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో సిజేరియన్ ద్వారా ఎక్కువ ఆపరేషన్లు చేసిన డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. -
‘తాడిపత్రిలో అల్లర్లకు ఆజ్యం పోసింది వైకాపా ఎమ్మెల్యేలే’
[ 18-05-2024]
తాడిపత్రి పట్టణంలో జరిగిన దాడులకు తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామిరెడ్డిలు ముఖ్య కారణమని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ ఆరోపించారు. -
తాగునీటి సరఫరా అధ్వానం.. ఎటు చూసినా అపరిశుభ్రం
[ 18-05-2024]
ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంతోపాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
[ 18-05-2024]
ముదిగుబ్బ మండలంలోని గుంజేపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన లింగప్ప కుమారుడు రాజు (27) ముదిగుబ్బకు ఆటో నడుపుకొంటూ జీవనం సాగించే వాడు. అతనికి ఐదేళ్ల కిందట వివాహమైంది. -
రేషన్ పంపిణీకి నేడు ఆఖరు
[ 18-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీపై ఎన్నికల ప్రభావం పడింది. ఈ నెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారం తదితర కారాణాల వల్ల కార్డుదారులకు సరకులు అందలేదు. -
చెన్నకేశవుడి రాజసం
[ 18-05-2024]
పట్టణంలో జరుగుతున్న లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సర్వ భూపాల వాహనం, రాత్రి సింహ వాహనంపై స్వామి వారు పురవీధుల్లో విహరించారు. -
భక్తుల కష్టాలు ఖాద్రీశుడికే ఎరుక!
[ 18-05-2024]
శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆవహించింది. పుణ్యక్షేత్రంగా కదిరి ఆలయానికి వేలాది మంది వచ్చే దర్శన భక్తులకు తగిన సదుపాయాలు కలగక అవస్థలతో ప్రశాంత దర్శన భాగ్యం పొందలేకున్నారు. -
ఇదేంది సారూ.. పారితోషికంలో తేడాలా?
[ 18-05-2024]
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించగల సత్తా ఉపాధ్యాయులకే ఉందని, వారిని తప్పించి, ఇతరులతో ఈ ప్రక్రియను నిర్వహిస్తే అస్తవ్యస్తమవుతుందని, వారు మాత్రమే కచ్చితంగా నిర్వహించగలరని ఎన్నికల సంఘం కితాబు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం