దివ్యమైన విజయం
వారి లక్ష్యం.. సంకల్పబలం ముందు వైకల్యం చిన్నబోయింది.
నేడు దివ్యాంగుల దినోత్సవం
వారి లక్ష్యం.. సంకల్పబలం ముందు వైకల్యం చిన్నబోయింది. వైకల్యంతో పుట్టిన వారు కొందరైతే.. జీవిత పయనంలో ప్రమాదాలు జరిగి దివ్యాంగులుగా మారిన వారు ఇంకొందరు. ఒకవైపు పేదరికం.. మరోవైపు వైకల్యం వెంటాడుతున్నా.. అధైర్య పడలేదు. మెండైన ఆత్మస్థైర్యంతో వారి కాళ్లపై వారు నిలబడి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
న్యూస్టుడే, చిత్తూరు (జిల్లా పంచాయతీ), శాంతిపురం, కుప్పం పట్టణం, కల్లూరు, చౌడేపల్లి
మూడు చక్రాలే ఆధారంగా...
చౌడేపల్లి మండలంలోని కాగతి పంచాయతీ పలగార్లపల్లెకు చెందిన వెంకట్రమణ కుడికాలు మోకాలు వరకు లేదు. సుమారు 15 ఏళ్ల క్రితం కూలీ పనులకు వెళ్లి పొలం గట్టు పైనుంచి పడి కాలు విరిగింది. బాగు చేసుకోవడానికి ప్రయత్నించారు. ఫలితం లేదు. చివరకు మోకాలు వరకు తీసేశారు. అప్పటి నుంచి బతుకు భారమైంది. సొంతంగా తీసుకొన్న మూడు చక్రాల సైకిల్కు రూ.30 వేలు ఖర్చు చేసి చెక్కతో పెట్టె తయారు చేశాడు. అందులో తినుబండారాలు, నిత్యావసరాలు తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తో పాటు వస్తువులను విక్రయించగా వచ్చే ఆదాయంతో భార్యను పోషిస్తు వికలత్వం కాలికే కాని పట్టుదలకు కాదని నిరూపిస్తూ ఆదర్శవంతంగా నిలిచాడు.
అత్మస్థైర్యమే.. ఆయుధం
కల్లూరు కొత్తకాలనీకి చెందిన నాగయ్య, జ్ఞానమ్మ రెండో కుమారుడు రాగల మణి పుట్టుకతో వైకల్యం రావడంతో పొట్ట సాయంతో ఇంటిలో దోగాడుతాడు. నాలుకతో అన్నం తినడం, నీళ్లు తాగడం అలవాటుగా చేసుకున్నాడు. ఇంట్లో టీవీ చూడాలంటే తన నాలుకతోనే రిమోర్టు నొక్కుతాడు, సునాయాసంగా టీవీ, చరవాణి నంబర్లు నొక్కుతాడు. నచ్చిన ఛానళ్లు చూస్తాడు. కాలకృత్యాలన్నీ తనే చేసుకుని తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. ప్రస్తుతం వయసు 34 సంవత్సరాలు.
‘ఆనంద’మయ జీవనం
శాంతిపురం మండలం వడగాండ్లపల్లెలో పేద కుటుంబానికి చెందిన ఆనంద్ పసి వయసులోనే పోలియోతో వైకల్యానికి గురయ్యాడు. డిగ్రీ(సాంకేతిక విద్య) పూర్తి చేశాడు. సొంత కాళ్లపై నిలబడాలని లక్ష్యంగా నిర్ణయించుకుని.. శాంతిపురంలో ఆన్లైన్ సేవా కేంద్రాన్ని పదేళ్ల కిందట ప్రారంభించాడు. ఓ ఇంటివాడైన ఆనంద్ సేవల విభాగంలో సంపాదనను సాకారం చేసుకొని ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడు.
రైతుగా రాణింపు
పులిచెర్ల మండలం రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ చిచ్చిలివారిపల్లెకు చెందిన రెడ్డిశేఖర్రెడ్డి 2003 ఆగస్టు 13న సొంత పొలంలో విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ప్రమాదంలో వెన్నెముకకు గాయం కావడంతో శస్త్ర చికిత్స ద్వారా కోలుకున్నాడు. అప్పటి నుంచి మూడు చక్రాల వాహనంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. పొలంలో ఉపాధి హామీ పథకంలో మామిడి మొక్కలు నాటుకుని భార్య శోభారాణికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. వాకర్ సాయంతో పొలంలో మామిడి చెట్లకు పాదులు తీయడం చిన్నపాటి పనులు చేసుకుంటూ భార్యకు సాయంగా ఉన్నాడు.
చిన్నబోయిన వైకల్యం
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గెర్సిబావికి చెందిన జ్యోతి పుట్టకతోనే అంగవైకల్యం. కాళ్లు సరిగా పనిచేయవు. చదువుకునేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించక పాఠశాల దశలోనే చదువు ఆపేసింది. గత ప్రభుత్వ రూ.35 వేలు రుణం ఇప్పించడంతో కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట దుకాణం నిర్వహిస్తోంది. అద్దె ఇంట్లో ఉంటూ నెలకు రూ.1200 చెల్లిస్తూ ఉంది. తన జీవితాన్ని దుకాణం ద్వారా ఆత్మస్థైర్యంతో నెట్టుకొస్తున్నట్లు చెప్పింది.
ఉమ్మడి జిల్లాలో దివ్యాంగులు : 93,997
శారీరక విభిన్న ప్రతిభావంతులు : 2,436
బధిరులు : 18,472
అంధులు : 5,673
బుద్ధిమాంధ్యులు : 17,416
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం