క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి.
ఉద్యోగ భద్రత హుష్కాకి
ప్రభుత్వ పథకాలకు కోతలు
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. ‘అధికారంలోకి రాగానే వీలైనంత ఎక్కువమంది ఒప్పంద ఉద్యోగుల సేవలు క్రమబద్ధీకరిస్తా. ఉద్యోగ భద్రత కల్పిస్తా’నంటూ 2019 ఎన్నికల సభల్లో బీరాలుపోయిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే మడమ తిప్పారు. హామీని విస్మరించి పథకాలు సైతం అందకుండా చేశారు. ఎన్నికలకు ముందు అతికొద్దిమందికి మాత్రమే అవకాశం కల్పించి అందులోనూ కోతలు వేసి చేతులు దులుపుకోవడంపై బాధిత ఉద్యోగులు భగ్గుమంటున్నారు.
- ఈనాడు డిజిటల్-తిరుపతి, న్యూస్టుడే, సూళ్లూరుపేట, చిత్తూరు(విద్య), పూతలపట్టు
పనిభారమంతా వారిపైనే..
ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఉన్న ఒప్పంద ఉద్యోగులు తమ శాఖల్లో బండెడు చాకిరీ చేయాల్సి వస్తోంది. రెగ్యులర్ ఉద్యోగులకంటే ఎక్కువగా పనిచేయాల్సి వచ్చినా ఎలాంటి అదనపు అలవెన్సులు లేవు. మూలవేతనం మాత్రమే అందుతోంది. సెలవు పెడితే వేతన కోతలు తప్పవు. ప్రధానంగా విద్యాశాఖలోని జూనియర్, డిగ్రీ కళాశాలల ఒప్పంద అధ్యాపకులు 600 మందిపైగా ఉండగా వారు స్థాయికి మించి కష్టపడుతున్నారు. సెలవుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, విద్యార్థుల ఇళ్లకు వెళ్లి నూతన ప్రవేశాలు చేయాల్సి వస్తోంది.
ఈ ప్రాణాలకు విలువేదీ?
- ఏడాదిన్నర కిందట వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తున్న వేణుగోపాల్ కళాశాల నుంచి 15 కి.మీల దూరంలోని మరో కళాశాలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఎలాంటి ఉద్యోగ భద్రత లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం అందలేదు. సిబ్బంది తక్కువ ఉండటంతో రెండు కళాశాలల్లో ఒకే అధ్యాపకుడు పాఠాలు చెప్పాల్సి ఉంది. విధి నిర్వహణలో మరణించిన ఆయనకు ఎలాంటి సహకారం అందించలేదు.
- పుంగనూరు నియోజకవర్గంలోని సదుం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసిన ఒప్పంద అధ్యాపకుడు శ్రీనివాసులురెడ్డి కరోనాతో చనిపోతే ఆదుకునే దిక్కులేదు.
- నగరిలో బాషా అనే ఒప్పంద ఉద్యోగి పనిఒత్తిడి కారణంగా గుండెపోటుతో మరణిస్తే, కనీసం అంతక్రియలకు ఆర్థిక సహాయం అందించిన పాపానపోలేదు.
నెలల తరబడి పస్తులు.. అందినకాడ అప్పులు
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో ప్రతినెలా వేతనాలు ఒకటో తేదీనే ఖాతాల్లో జమయ్యేవి. ముల్యాంకనం, పరీక్షల నిర్వహణకు అదనంగా ఇచ్చే డబ్బులు సకాలంలో వారి ఖాతాల్లో జమయ్యేవి. నేడు ఆ పరిస్థితి లేదు. ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా మూల్యాంకనం డబ్బులు రాలేదు. ఒకటో తేదీన పడాల్సిన వేతనాలు నెలలో 20వ తేదీవరకు జమకావడం లేదు. ఒక్కోసారి రెండుమూడు నెలలకుగానీ బిల్లులు పెట్టడం లేదు. ఏప్రిల్, మేలో సర్వీసు విరామం ఇస్తుండటంతో పస్తులుండే దుస్థితి.
ఉత్తచేతులతో ఉద్యోగ విరమణ
గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోక ఉద్యోగ భద్రతలేక ఇబ్బందులు పడుతున్నాం. దశాబ్దాలపాటు సేవలు అందించి చివరక ఎలాంటి ప్రయోజనాలు లేకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్నాం. కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడం లేదు.
రెడ్డప్పరెడ్డి, ఒప్పంద ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు
పాతికేళ్లుగా సేవలు
ఒప్పంద పద్ధతిలో పనిచేసే ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేస్తారన్న ఆశతో వేలమంది అరకొర వేతనాలతో పనిచేస్తున్నారు. 2000 నుంచి జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నవారున్నారు. సెలవులు లేక, ఇతర ప్రయోజనాలు అందక కుటుంబాలను పోషించడం కష్టంగా ఉంది.
- సురేష్నాయుడు, ఒప్పంద అధ్యాపకుల సంఘం(475), రాష్ట్ర కార్యదర్శి
ఏళ్లు గడిచిపోతున్నా న్యాయమేదీ?
కొన్నేళ్లుగా ప్రభుత్వం ఒప్పంద పద్ధతుల్లో నియామకాలు చేపడుతోంది. వారి సేవలను పరిగణలోకి తీసుకుని క్రమబద్ధీకరిస్తామని చెబుతున్నా కార్యరూపం దాల్చక ఏళ్లు గడిచిపోతున్నాయి. పెరిగిన నిత్యావస ధరలు మరోవైపు తక్కువ వేతనాలతో బతకలేకున్నాం. కనీసం ఎంటీఎస్ ప్రకటించి ఆ మేరకు జీతాలు ఇవ్వాలి.
- దేవరాజులు, ఎంఆర్సీఎస్ మెసెంజర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, చిత్తూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న.. భూభక్ష చట్టం
[ 05-05-2024]
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్ పలమనేరు వస్తున్నారని వైకాపా నేతలు సంబరపడ్డారు. స్థానిక సమస్యలు లేవనెత్తి ప్రజల మనసులు చూరగొంటారని ఆశపడ్డారు. రానున్న వారం రోజుల ప్రచారంలో వీటినే అస్త్రాలుగా మలుచుకుని ప్రజలకు వివరించాలనుకున్నా వారి ఆశలపై సీఎం నీళ్లు చల్లారు. -
జగన్మోసం.. ప్రశ్నించలేని వారిపై ప్రతాపం
[ 05-05-2024]
అభాగ్యులు, అవ్వాతాతలకు జరుగుతోన్న జగన్మోసం అంతాఇంతా కాదు.. ఓట్ల రాజకీయం కోసం ముఖ్యమంత్రి జగన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులతో చెలగాటమాడుతున్నారు.. ఒకటో తేదీన ఇంటి వద్ద ఇచ్చే పింఛను రెండు నెలలుగా సచివాలయాలు, బ్యాంకులంటూ మండే ఎండల్లో అమాయకులను ముప్పతిప్పలు పెడుతున్నారు. -
నేడు, రేపు పోస్టల్ బ్యాలెట్ వినియోగం
[ 05-05-2024]
ఎన్నికల సిబ్బంది తమ పోస్టల్ బ్యాలెట్ను ఆది, సోమవారాల్లో వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ కోరారు. పలు శాఖల అధికారులకు శనివారం ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ‘5న పీవో, ఏపీవో, ఓపీవో, ఎంవోలు, అంగన్వాడీలు, 6న అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారు.. -
గడిచాయి ఐదేళ్లు.. ఏవీ నీళ్లు?
[ 05-05-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి’ అన్నది సామెత. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపాలో నంబరు-2 అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ మిథున్రెడ్డిది మన జిల్లానే కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని ప్రజలు భావించారు. -
జరుగు జరుగు.. జాబుల్లేవ్ జగన్
[ 05-05-2024]
ఏటా ప్రారంభంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా.. మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తా.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అంతమొందించడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సమయాన నిర్వహించిన పాదయాత్రలో గొప్పగొప్ప హామీలు గుప్పించారు.. -
ఇదేంది జగన్.. ఇలా తిప్పుతున్నావ్..!
[ 05-05-2024]
పూతలపట్టు మండలం కొత్తకోటకు చెందిన ఓ వృద్ధుడికి బ్యాంకు ఖాతా ఉంది. ఆయనకు వచ్చే పింఛను బ్యాంకులో జమ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆయన రెండ్రోజులుగా బ్యాంకు వెళ్లినా ఇంకా జమ కాలేదనే సమాధానం వస్తోంది. -
అండగా ఉంటాం.. ఆదరించండి
[ 05-05-2024]
ప్రజలకు అండగా ఉంటాం.. ఆదరించండని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, ఆయన సతీమణి ప్రతిమ, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, సాయికృష్ణారెడ్డి అన్నారు. శనివారం నగరంలోని చర్చివీధి, మార్కెట్ చౌక్, 3, 7వ డివిజన్లతో పాటు, శంకరయ్యగుంటలో వారు విడివిడిగా ప్రచారం చేశారు. -
‘కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నా’
[ 05-05-2024]
కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నట్లు బీఎన్ కండ్రిగ మండలం చిన్నపాలవేడు గ్రామానికి చెందిన విశ్రాంత ఎస్పీ రమేషయ్య తెలిపారు. శనివారం ఆయన కూటమి తెదేపా అభ్యర్థి కోనేటి ఆదిమూలం సమక్షంలో తెదేపాలో చేరారు. -
పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 05-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది కోసం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్వోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్కు వైకాపా నేతల ప్రలోభాలు
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నేతలు ప్రలోభాలకు తెరతీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. -
శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మందికి అస్వస్థత
[ 05-05-2024]
శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గంగవరం మండలం నలసానపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ఇంట్లో శుభకార్యానికి బంధువులు, స్నేహితులు వచ్చారు.