logo

తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి

ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్‌రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు.

Published : 26 Apr 2024 04:08 IST

సుగుణమ్మతో మాట్లాడుతున్న చంద్రబాబు

రేణిగుంట: ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్‌రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. గురువారం రాత్రి విమానాశ్రయంలో వీరు పార్టీ నాయకులతో వేర్వేరుగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీట్లు గెలిచి తీరాలని ఇరు పార్టీల అధ్యక్షులు తమ నాయకులకు స్పష్టం చేశారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. చంద్రబాబునాయుడు ఆరణి శ్రీనివాసులుతో మాట్లాడిన తర్వాత తెదేపా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహయాదవ్‌తో ప్రత్యేకంగా చర్చించారు. శ్రీకాళహస్తి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని