తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది.
నామినేషన్ల సందర్భంగా నిబంధనల అమలులో పోలీసుల వైఫల్యం
అధికార పార్టీ జెండాలతో వచ్చినా పట్టించుకోని వైనం
నిబంధనలు ఉల్లంఘించి వాహనంపై కార్యకర్తలతో వస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఈనాడు-తిరుపతి, తిరుపతి(రెవెన్యూ), న్యూస్టుడే: చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. నామినేషన్ల సమర్పణకు చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకేసారి, ఒకే సమయంలో వస్తున్నారనే సమాచారం ఉన్నా అధికారులు, పోలీసులు కనీస ప్రణాళిక చేయలేదు. బలపరీక్షలో నెగ్గేందుకే అన్నట్లు వైకాపా నేతలు వ్యవహరించినా, ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరం దాటి ఐదుగురు మాత్రమే రావాలన్న నిబంధనను మంట గలిపినా పోలీసులు చోద్యం చూశారు. అధికార పార్టీ శ్రేణులు రెచ్చగొట్టేలా ప్రవర్తించినా, రాళ్ల దాడులకు సమాయత్తమైనా పట్టించుకోలేదు. పరిస్థితి రణరంగంగా మారిన తర్వాత మేలుకోవడం గమనార్హం. నామినేషన్లకు గురువారం చివరి రోజు కావడంతో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి, తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ఒకేసారి తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి వాహనాల్లో చేరుకున్నారు. ఎన్నికల అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో ఆగిపోవాల్సి ఉన్నా కార్యాలయ గేటు వరకు వైకాపా కార్యకర్తలు జెండాలతో తరలివచ్చారు. నిలువరించాల్సిన పోలీసులు పట్టించుకోలేదు. వంద మీటర్లు దాటి అభ్యర్థి, మరో నలుగురు మాత్రమే వెళ్లాలన్న నిబంధనను పోలీసులు అమలు చేయలేకపోయా రు. పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. కొద్దిమంది భద్రత సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు వీరంగం చేస్తున్నా కనీసం వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదని తెదేపా శ్రేణులు పోలీసులతో వాదనకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ః ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని చంద్రగిరి నియోజకవర్గం ఎన్నికల అధికారి ఎ.నిషాంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.
ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం: పులివర్తి నాని
వైకాపా కార్యకర్తలు రాళ్లు వేసినా మేం శాంతియుతంగానే ఉన్నాం. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎమ్మెల్యే భాస్కర్రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఉచ్చులో మేం పడం. 25న నామినేషన్ వేస్తున్నట్లు ముందుగానే చెప్పాం. వైకాపా వాళ్లు మొదట 24 అని మళ్లీ 25కి మార్చుకున్నారు. ఈ ఘటనలో మా వాళ్లను నలుగురికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం.
వైకాపా శ్రేణులను చెదరగొట్టేందుకు ఇద్దరు పోలీసులు మాత్రమే యత్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్ పలమనేరు వస్తున్నారని వైకాపా నేతలు సంబరపడ్డారు. స్థానిక సమస్యలు లేవనెత్తి ప్రజల మనసులు చూరగొంటారని ఆశపడ్డారు. రానున్న వారం రోజుల ప్రచారంలో వీటినే అస్త్రాలుగా మలుచుకుని ప్రజలకు వివరించాలనుకున్నా వారి ఆశలపై సీఎం నీళ్లు చల్లారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
[ 05-05-2024]
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
జగన్మోసం.. ప్రశ్నించలేని వారిపై ప్రతాపం
[ 05-05-2024]
అభాగ్యులు, అవ్వాతాతలకు జరుగుతోన్న జగన్మోసం అంతాఇంతా కాదు.. ఓట్ల రాజకీయం కోసం ముఖ్యమంత్రి జగన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులతో చెలగాటమాడుతున్నారు.. ఒకటో తేదీన ఇంటి వద్ద ఇచ్చే పింఛను రెండు నెలలుగా సచివాలయాలు, బ్యాంకులంటూ మండే ఎండల్లో అమాయకులను ముప్పతిప్పలు పెడుతున్నారు. -
నేడు, రేపు పోస్టల్ బ్యాలెట్ వినియోగం
[ 05-05-2024]
ఎన్నికల సిబ్బంది తమ పోస్టల్ బ్యాలెట్ను ఆది, సోమవారాల్లో వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ కోరారు. పలు శాఖల అధికారులకు శనివారం ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ‘5న పీవో, ఏపీవో, ఓపీవో, ఎంవోలు, అంగన్వాడీలు, 6న అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారు.. -
గడిచాయి ఐదేళ్లు.. ఏవీ నీళ్లు?
[ 05-05-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి’ అన్నది సామెత. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపాలో నంబరు-2 అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ మిథున్రెడ్డిది మన జిల్లానే కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని ప్రజలు భావించారు. -
జరుగు జరుగు.. జాబుల్లేవ్ జగన్
[ 05-05-2024]
ఏటా ప్రారంభంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా.. మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తా.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అంతమొందించడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సమయాన నిర్వహించిన పాదయాత్రలో గొప్పగొప్ప హామీలు గుప్పించారు.. -
ఇదేంది జగన్.. ఇలా తిప్పుతున్నావ్..!
[ 05-05-2024]
పూతలపట్టు మండలం కొత్తకోటకు చెందిన ఓ వృద్ధుడికి బ్యాంకు ఖాతా ఉంది. ఆయనకు వచ్చే పింఛను బ్యాంకులో జమ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆయన రెండ్రోజులుగా బ్యాంకు వెళ్లినా ఇంకా జమ కాలేదనే సమాధానం వస్తోంది. -
అండగా ఉంటాం.. ఆదరించండి
[ 05-05-2024]
ప్రజలకు అండగా ఉంటాం.. ఆదరించండని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, ఆయన సతీమణి ప్రతిమ, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, సాయికృష్ణారెడ్డి అన్నారు. శనివారం నగరంలోని చర్చివీధి, మార్కెట్ చౌక్, 3, 7వ డివిజన్లతో పాటు, శంకరయ్యగుంటలో వారు విడివిడిగా ప్రచారం చేశారు. -
‘కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నా’
[ 05-05-2024]
కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నట్లు బీఎన్ కండ్రిగ మండలం చిన్నపాలవేడు గ్రామానికి చెందిన విశ్రాంత ఎస్పీ రమేషయ్య తెలిపారు. శనివారం ఆయన కూటమి తెదేపా అభ్యర్థి కోనేటి ఆదిమూలం సమక్షంలో తెదేపాలో చేరారు. -
పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 05-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది కోసం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్వోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్కు వైకాపా నేతల ప్రలోభాలు
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నేతలు ప్రలోభాలకు తెరతీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. -
శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మందికి అస్వస్థత
[ 05-05-2024]
శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గంగవరం మండలం నలసానపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ఇంట్లో శుభకార్యానికి బంధువులు, స్నేహితులు వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు