logo

వైకాపా ప్రచారంపై తెదేపా అభ్యంతరం

పలమనేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారు.

Published : 06 May 2024 04:49 IST

ఇరువర్గాల వాగ్వాదం

వైకాపా నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

పలమనేరు, న్యూస్‌టుడే: పలమనేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తెదేపా నాయకులు అడ్డుకున్నారు. కొందరు అక్రమంగా కేంద్రంలోకి చొచ్చుకెళ్లగా.. వైకాపా నాయకుడు జాఫర్‌ ద్విచక్రవాహన ర్యాలీ చేసేందుకు యత్నించారు. అతన్ని పోలీసులు నిలువరించారు. వారు వెళ్తున్నా.. ప్రేక్షకపాత్ర వహించిన అధికారులపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెదేపా, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అందరినీ దూరంగా పంపించారు. ఆర్డీవో మనోజ్‌రెడ్డి ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు