logo

కుప్పంలో నేడు, రేపు.. నారా భువనేశ్వరి పర్యటన

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి మంగళ, బుధవారాల్లో కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు.

Published : 07 May 2024 02:56 IST

కుప్పం: తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి మంగళ, బుధవారాల్లో కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 4.30 గంటలకు బెంగళూరు నుంచి శాంతిపురం మండలానికి చేరుకుంటారు. సాయంత్రం 6.45 గంటలకు వడగాండ్లపల్లె, అనికెర క్రాసులో ఎన్నికల ప్రచారం చేపడతారు. రాత్రి 7.30 గంటలకు సోగడబళ్ల, 8.15 గంటలకు కెనమాకులపల్లె, 9 గంటలకు శాంతిపురంలో పర్యటిస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు కుప్పం మండలం దాసేగానూరు, కంగుంది గ్రామాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రామకుప్పం మండలంలోని గోవిందపల్లె, బల్ల, వీర్నమల, పంద్యాలమడుగులో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు పల్లికుప్పం, బందార్లపల్లె, రామకుప్పంలో పర్యటిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని