కట్టకుంటే.. కట్టేత్తారంతే..
కాకినాడ నగరంలో యూజర్ ఛార్జీల వసూళ్లకు కఠిన చర్యలు అవలంబిస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటా చెత్త సేకరణ నిర్వహణ భారంగా మారింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమంలో భాగంగా 2021 డిసెంబరు నుంచి తడి, పొడి చెత్త, హానికారక వ్యర్థాలను వేర్వేరుగా సేకరణకు శ్రీకారం చుట్టారు.
రామారావుపేటలో ఓ కొళాయి కనెక్షన్ తొలగిస్తున్న కార్పొరేషన్ సిబ్బంది
బాలాజీచెరువు(కాకినాడ), న్యూస్టుడే: కాకినాడ నగరంలో యూజర్ ఛార్జీల వసూళ్లకు కఠిన చర్యలు అవలంబిస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటా చెత్త సేకరణ నిర్వహణ భారంగా మారింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమంలో భాగంగా 2021 డిసెంబరు నుంచి తడి, పొడి చెత్త, హానికారక వ్యర్థాలను వేర్వేరుగా సేకరణకు శ్రీకారం చుట్టారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 108 ప్రత్యేక వాహనాలను కేటాయించింది. వీటి నిర్వహణకు(డ్రైవర్లు, డీజల్) ప్రతినెలా రూ.56 లక్షలు ఖర్చవుతోంది. దీన్ని ప్రజల నుంచి సేవారుసుం వసూలు చేయాలని నిర్ణయించారు. నెలకు పేదలవాడల్లో రూ.60, మిగతా ప్రాంతాల్లో రూ.90 చొప్పున ఖరారు చేశారు. నగరంలోని 87,531 కుటుంబాలు, 5,500 దుకాణాలు, వాణిజ్య సంస్థల నుంచి నెలకు రూ.72లక్షల వరకు యూజర్ఛార్జీలు రూపంలో వసూలు చేయాలని లక్ష్యంగా చేసుకున్నారు.
15 వేల కుటుంబాల గుర్తింపు..
కొత్త విధానం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా యూజర్ ఛార్జీలు చెల్లించని 15 వేల కుటుంబాలను గుర్తించారు. వీరి కొళాయి కనెక్షన్లను తొలగింపునకు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులు నాలుగు కనెక్షన్లను మూసివేశారు. మొండిబకాయిదారులకు ఆయా వార్డు సచివాలయ శానిటరీ సెక్రటరీల ద్వారా సమాచారం అందిస్తున్నారు. అప్పటికీ స్పందించకపోతే కొళాయి కనెక్షన్లు తొలగిస్తున్నారు.
మూడు నెలలుగా తగ్గిపోవడంతో..
వాహనం ద్వారా చెత్త సేకరిస్తున్న సిబ్బంది
యూజర్ ఛార్జీలు వసూలు ప్రారంభించిన తరువాత మొదటి రెండు నెలల పాటు ఆశించిన స్థాయిలో చెల్లింపులు జరిగినా.. మూడు నెలలుగా రాబడి బాగా క్షీణించింది. ఇది కార్పొరేషన్కు భారంగా మారింది. వాహనాల నిర్వహణ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ప్రతినెలా దీనికి సొమ్ములు చెల్లిస్తేనే వాహనాలు తిప్పే పరిస్థితి ఉంది. యూజర్ ఛార్జీలు సక్రమంగా వసూలు కాకపోతే జులై నుంచి ఇంటింటా చెత్త సేకరణ అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఈ పరిస్థితుల్లో వసూళ్లకు కఠిన చర్యలు అవలంబిస్తున్నారు. వీటిని చెల్లించని కుటుంబాలకు తాగునీటి సరఫరా నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ కె.రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిధుల వాడకానికి ఆదేశాలు
నగరపాలక సంస్థ పరిధిలో 14 శానిటేషన్ సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో 100 వార్డు సచివాలయాలున్నాయి. ప్రతీ సచివాలయానికి ఒక ప్రత్యేక వాహనాన్ని కేటాయించారు. వీటి పరిధిలో 1000 మించి జనాభా ఉంటే రెండో వాహనం ఇస్తున్నారు. వాహనాల నిర్వహణకు అవసరమైతే సాధారణ నిధులను వినియోగించాలని పురపాలక శాఖ ఆదేశించింది. సేవా రుసుం వసూలు కాకపోతే సాధారణ నిధులు ఖర్చు చేస్తే, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. వీటిని చెల్లించని కుటుంబాలకు తాగునీటి సరఫరా నిలిపివేయడం ద్వారా వసూలు చేయాలని భావిస్తున్నారు. అప్పటికి కొలిక్కిరాకపోతే ఇతర సదుపాయాలు నిలిపివేసే అవకాశం ఉంది.
తప్పనిసరి పరిస్థితుల్లోనే..
- డాక్టర్ డి.పృథ్వీచరణ్, ఎంహెచ్వో, కాకినాడ నగరపాలక సంస్థ
తప్పనిసరి పరిస్థితుల్లోనే సేవా రుసుం చెల్లించని కుటుంబాలకు కొళాయి కనెక్షన్ నిలిపివేస్తున్నారు. ఇంటింటా చెత్త సేకరణపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాం. తొలుత 78 శాతం మంది వీటిని చెల్లించారు. క్రమేపీ ఇది తగ్గుతోంది. ఇది భారంగా మారుతోంది. ప్రజలపై భారం లేకుండానే రూ.60, రూ.90 చొప్పున నెలకు యూజర్ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి శానిటరీ సెక్రటరీని పంపిస్తున్నాం. అయినా కొంత మంది చెల్లించడం లేదు. భవిష్యత్తులో సులభతరంగా వీటిని చెల్లించడానికి ఈ-పోస్ యంత్రాలను తీసుకువస్తున్నాం. సొమ్ములిచ్చిన వెంటనే రసీదు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. సాధారణ నిధుల జోలికి వెళ్లకుండా, యూజర్ ఛార్జీలతోనే వాహనాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.