‘ప్రజాపాలన గాలికి వదిలేశారు’
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రాభివృద్ధి, ప్రజా పాలనను గాలికి వదిలేసి సొంత ఆస్తులు పెంచుకోవడంపైనే దృష్టి సారించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. భాజపా చేపట్టిన ప్రజా పోరు యాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలో శనివారం నిర్వహించిన వీధి సభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు.
మాట్లాడుతున్న సోము వీర్రాజు
దేవీచౌక్(రాజమహేంద్రవరం): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రాభివృద్ధి, ప్రజా పాలనను గాలికి వదిలేసి సొంత ఆస్తులు పెంచుకోవడంపైనే దృష్టి సారించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. భాజపా చేపట్టిన ప్రజా పోరు యాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలో శనివారం నిర్వహించిన వీధి సభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. తెదేపా పాలనపై విసుగుచెందిన ప్రజలు జగన్ మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలు నమ్మి అధికారం ఇస్తే పాదయాత్రలో చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో కనిపిస్తున్న అభివృద్ధి ఏదైనా ఉందంటే అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని ప్రజలకు ఇవ్వకుండా దోచుకుతింటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉచిత బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. ఎక్కువ ధరకు మద్యం అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయాన్నే జగన్ తిరిగి ప్రజలకు ఇస్తున్నాడన్నారు. బ్రాందీ తయారు చేసేది, సారా కాచేది జగనే అని పేర్కొన్నారు. బ్రాందీ సీసాలపై జగన్ బొమ్మవేస్తే చాలా బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఇసుక ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక జాతీయ రహదారులు నిర్మిస్తుంటే వైకాపా ప్రభుత్వం కనీసం గోతులు కూడా పూడ్చలేని స్థితిలో ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు భాజపాను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, కార్యక్రమ కన్వీనర్ యెనుముల రంగబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.