ఎయిమ్స్లో సీట్లు ఇప్పిస్తానంటూ మోసం
మంగళగిరి ఎయిమ్స్లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని ఇద్దరు విద్యార్థినుల నుంచి ప్రేమ్కుమార్ కాశీ అనే వ్యక్తి రూ.4 లక్షలు కాజేశాడు.
విద్యార్థినుల నుంచి రూ.4 లక్షలు కాజేసిన నకిలీ ఐఏఎస్
ఈనాడు-అమరావతి: మంగళగిరి ఎయిమ్స్లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని ఇద్దరు విద్యార్థినుల నుంచి ప్రేమ్కుమార్ కాశీ అనే వ్యక్తి రూ.4 లక్షలు కాజేశాడు. మంగళగిరి డైరెక్టర్ పేరుతో ఆయన పంపిన మెయిల్్్స ఆధారంగా ఎయిమ్స్లో చేరేందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి మోసపోయామని తెలిసింది. ఈ వ్యవహారంపై తాడేపల్లి పోలీసులకు మంగళగిరి ఎయిమ్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యార్థినికి నీట్లో జాతీయ స్థాయిలో 7 లక్షలు, మరో విద్యార్థినికి పెద్ద ర్యాంకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థినికి తెలిసిన వారి ద్వారా పరిచయమైన ప్రేమ్కుమార్ కాశీ తాను ఐ.ఎ.ఎస్. అధికారినని మంగళగరి ఎయిమ్స్లో ఎంబీబీఎస్లో సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. మంగళగిరి ఎయిమ్స్లో సీటు అనేసరికి ఆమె స్నేహితురాలు కూడా తానూ డబ్బు ఇస్తానని చెప్పింది. ఈ మేరకు ఆయన చెప్పిన ఫోన్ నంబర్లకు విడతల వారీగా 1,36,500 ఫోన్ పే చేశారు. మరో రూ.2,63,500 నేరుగా అందచేశారు. ఈ చెల్లింపులు జరిగిన అనంతరం వీరిరువురికి మంగళగిరి డైరెక్టర్ పేరుతో నవంబరు 30న మెయిల్ వెళ్లింది. అందులో డిసెంబరు 1 నుంచి 3వ తేదీలోగా వచ్చి చేరాలని ఉంది. ఈ మెయిల్ వచ్చినప్పటి నుంచి వారు అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో వారు ఈ నెల 3న మంగళగిరి ఎయిమ్స్కు వెళ్లారు. అక్కడి ఉద్యోగులు ఆ మెయిల్ను తాము పంపలేదని చెప్పడంతో ఆ విద్యార్థినులు ఎయిమ్స్ డైరెక్టర్కు ఫిర్యాదుచేశారు. ఈ సంఘటనకు ముందు కర్ణాటకలోని బెంగుళూరు మెడికల్ కళాశాల వద్దకు వీరిని తీసుకువెళ్లాడు. అక్కడ కూడా సీటు వచ్చిందని నకిలీ మెయిల్ సృష్టించినట్లు బాధిత విద్యార్థులు చెప్పారని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. కాశీ ఇన్స్టాగ్రామ్లో పద్మ పురస్కారానికి ఎంపికైనట్లు, విశాఖ ఎన్సీఈఆర్టీ జోనల్ ప్రాజెక్టు డైరెక్టరుగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా ఉన్న వార్తలు (చిన్న పత్రికలోనివి) కూడా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!