పులకించె మది.. నృసింహ పరిణయమిది
సాగరసంగమ కెరటాల వేదహోరులో అంతర్వేదిలోని పవిత్ర ధామం దేదీప్యమానంగా శోభిల్లింది. వేదమంత్రోచ్చారణతో జరిగిన మహత్కార్యం అలరించింది.
వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణ క్రతువు
న్యూస్టుడే, అంతర్వేది, మామిడికుదురు, రాజోలు: సాగరసంగమ కెరటాల వేదహోరులో అంతర్వేదిలోని పవిత్ర ధామం దేదీప్యమానంగా శోభిల్లింది. వేదమంత్రోచ్చారణతో జరిగిన మహత్కార్యం అలరించింది. అణువణువూ ఆధ్యాత్మిక పరవశంతో వేడుక అంబరాన్ని తాకింది. నింగీ నేలా మురిసే వేళ.. భక్తజనం పారవశ్యంతో నేత్రపర్వంగా చూస్తున్న శుభ సమయాన.. దశమి మంగళవారం రోహిణీ నక్షత్ర యుక్త తులా లగ్నం పుష్కరాంశమున రాత్రి 12.46 గంటలకు స్వర్ణకాంతులతో మెరిసిపోతున్న శ్రీదేవి, భూదేవితో నారసింహస్వామివారి జగత్కల్యాణం నయనోత్సవంగా సాగింది. నమో నారసింహా స్మరణలు మిన్నంటాయి. సాయంత్రం పంచముఖాంజనేయ, గరుడ వాహన సేవ, ఎదుర్కోలు సన్నాహం జరిగింది. స్వర్ణాభరణాలు అలంకరించిన ఉత్సవమూర్తులను రాత్రి 10.29 గంటలకు ప్రధాన ఆలయం నుంచి తెచ్చి పరిమళభరిత పుష్పాలతో అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు. అర్చకుడు శ్రీనివాసకిరణ్, వైదిక బృందం పరిణయ ఘట్టాన్ని నిర్వహించారు. స్వామి, ఉభయ దేవేరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. మాంగల్యధారణ వైభవంగా జరిగింది. తలంబ్రాల ఘట్టం ఆద్యంతం భక్తులను పులకింపజేసింది.
దివ్య రథోత్సవం నేడు
లక్ష్మీనృసింహుని దివ్య రథోత్సవం బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించేలా సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మాంగల్యధారణ అనంతరం దేవేరులతో స్వామివారు
దేదీప్యమానం: వెలుగొందుతున్న అంతర్వేది క్షేత్రం
పట్టువస్త్రాలు తెస్తున్న మంత్రులు, ఎమ్మెల్యే
కలెక్టర్లు హిమాన్షు, కృతికా శుక్లా..
శోభాయమానం: యువత కోలాహలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!