అంగన్వాడీ సిబ్బంది మహాధర్నా
డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ సిబ్బంది కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై నాలుగు గంటలపాటు బైఠాయించి మహాధర్నా చేశారు.
కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు
వి.ఎల్.పురం(రాజమహేంద్రరం): డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ సిబ్బంది కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై నాలుగు గంటలపాటు బైఠాయించి మహాధర్నా చేశారు. గ్రాట్యూటీ అమలు చేయాలని, 2017 నుంచి పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని, అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్.మాణిక్యాంబ, కార్యదర్శి బేబీరాణి, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.రాజులోవ తదితరులు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు తెలంగాణలో ఇస్తున్న వేతనం కంటే అదనంగా రూ.వెయ్యి ఇస్తానని చెప్పి మాట తప్పారన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించి ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్ పెడితే ఎలాగని ప్రశ్నించారు. కనీసం సిబ్బందికి నెలనెలా వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తోపులాట.. ఉద్రిక్తత
మహాధర్నా అనంతరం తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందించేందుకు బారికేడ్లు దాటుకుంటూ అంగన్వాడీ సిబ్బంది కలెక్టరేట్ లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. కలెక్టర్ మాధవీలత స్పందించి పదిమంది ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపేందుకు ఆహ్వానించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.