హిజ్రా హత్య కేసులో నిందితుల అరెస్ట్
ఆలమూరు మండలం జొన్నాడలో జరిగిన హిజ్రాహత్యకేసును పోలీసులు ఛేదించారు. వివరాలను అమలాపురంలో ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ షేక్ ఖాదర్ బాషా బుధవారం విలేకరులకు తెలిపారు.
అమలాపురం పట్టణం: ఆలమూరు మండలం జొన్నాడలో జరిగిన హిజ్రాహత్యకేసును పోలీసులు ఛేదించారు. వివరాలను అమలాపురంలో ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ షేక్ ఖాదర్ బాషా బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 13న జొన్నాడ నేషనల్హైవే ఆనుకుని పంటకాలువలో ధవళేశ్వరానికి చెందిన మరపట్ల ఆనంది అనే హిజ్రాను పీక కోసి చంపినట్లు గుర్తించామన్నారు. ఆనంది గురువు ధనాల మందాకిని ఫిర్యాదు మేరకు ఆలమూరు పోలీస్స్టేషన్లో ఎస్ఐ శివప్రసాద్ కేసు నమోదు చేశారన్నారు. ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు డీఎస్పీ రమణ పర్యవేక్షణలో రావులపాలెం సీఐ రజనీకుమార్ దర్యాప్తు చేపట్టారన్నారు. ఆనందితో పరిచయం ఉన్న కేతా భరత్ వెంకట సుధీర్ అలియాస్ (పెద్ద కేతా), అతని స్నేహితులైన వీలు కల్యాణ్ అలియాస్ (పెద్ద కల్లీ), సింగంపల్లి కార్తికేయ అలియాస్ సింభ, (సోనూ)లను విచారించగా హత్య బండారం బయటపడిందన్నారు. 12వ తేదీ రాత్రి పెద్ద కేతా స్నేహితురాలైన ఆనంది (హిజ్రా), సోనూతో కలిసి మోటారు వాహనంపై మద్యం సీసాలతో ఎక్కించుకుని జొన్నాడ శివారు పంటకాలువ వద్దకు తీసుకొచ్చారు. వారు ఫోన్ చేయడంతో అక్కడకు పెద్ద కల్లీ చేరుకుని నలుగురు కలిసి మద్యం తాగుతుండగా తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని పెద్దకేతా కోపంతో తన వద్దనున్న బటన్ నైఫ్తో ఆనంది నడుము మీద పొడిచాడు. సోనూ కాళ్లు పట్టుకోగా కల్లీ అదే కత్తితో వివిధ భాగాల్లో కోసివేయగా సోనూ బీర్బాటిల్తో తల మీద కొట్టి పంటబోదిలోకి నెట్టివేశారన్నారు. అప్పటికి కొన ఊపిరితో కదలుతూ ఉండటంతో గమనించిన కల్లీ ఆనంది మెడను వెనక్కి లాగి కత్తితో పీకను కోసి చంపారన్నారు. సమావేశంలో క్రైమ్ సీఐ గోవిందరావు, ఎస్బీ సీఐ రజనీకుమార్, సీఐ రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.