ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి..
అనధికార ఇసుక తవ్వకాలపై ఇదీ పరిస్థితి
అధికార పార్టీ నేత విన్నవించినా తగ్గేదేలే!
న్యూస్టుడే, సీతానగరం
ముగ్గళ్లలో తవ్వకాలు చేస్తున్నారిలా..
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. ఓ అధికార పార్టీ ప్రజాపత్రినిధి ఇసుకాసురులకు విన్నవించుకున్న తీరిది. దీంతో ఒకరు తవ్వకాలు నిలిపివేయగా.. మరోచోట మాత్రం అంగీకరించలేదు. వైకాపా తిరిగి అధికారంలోకి రాకపోతే తవ్వకాల కోసం చెల్లించుకున్న రూ.కోట్లకు ఎవరు సమాధానం చెబుతారంటూ ప్రశ్నించినట్లు భోగట్టా. ఈ రేవులో తవ్వకాల వెనక ప్రభుత్వంలో కీలక వ్యక్తి ఒకరు దన్నుగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికూడలి, ముగ్గళ్ల వద్ద అయిదేళ్లుగా అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనలకు దిగినా.. ఎన్జీటీకి ఫిర్యాదులు వెళ్లినా.. పట్టించుకున్న నాథుడే లేరు. పట్టా భూముల్లో తవ్వకాలపై పంట భూములు పనికిరాకుండా మారుతున్నాయని రైతులు పోరాటం చేస్తే.. వైకాపా నాయకుల కనుసైగలతో అధికార యంత్రాంగం ఇసుక వ్యాపారులకు అండగా నిలవడం విశేషం. గోదావరి నదీగర్భానికి హద్దులు వేసి.. ఇది తమ పరిధి కాదని, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలకు వస్తుందంటూ అధికారులు తప్పించుకునేవారు. 150 నుంచి 200 కిలోమీటర్లు దూరంలో ఉండే ఏలూరు జిల్లాకు వెళ్లినా ఇసుకాసురుల ముందు రైతుల మొర అరణ్యరోదనగానే మిగిలేది. గతం కంటే తవ్వకాలు పెరిగిపోవడంపై ప్రజల్లో వ్యతిరేకతను స్థానిక వైకాపా నాయకులు గ్రహించారు. ఎన్నికల వేళ పరిస్థితి ఇబ్బంది మారుతుందని ఇసుక తవ్వకాలు నిలిపివేయడంటూ హుకుం జారీ చేశారు.
ఒకరు తలూపితే.. మరొకరు కాదు పొమ్మన్నారు..
ఓ ప్రజాప్రతినిధి ఇచ్చిన ఆదేశాలతో సీతానగరం మండలంలోని మునికూడలి ఇసుక రేవులో తవ్వకాలను బుధవారం నిలిపివేశారు. ముగ్గళ్లలో మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రూ.కోట్లు చేతులు మారాయని, మొదలుపెట్టి నెల రోజులు కూడా కాలేదని.. ఇప్పటికిప్పుడు నిలిపివేస్తే దెబ్బతింటామని తవ్వకాలు ఆపేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇసుక రేవుల్లో ఓ ప్రైవేటు సంస్థ పేరుకు మాత్రమే ఉందని, వెనుక అంతా అధికార పార్టీ నేతలదే హవాగా మారిందని, జిల్లా ఉన్నతాధికారి ఒకరు వీరికి అండగా నిలుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ముగ్గళ్ల రేవులో స్నానానికి దిగి ఒక యువకుడు మృతిచెందడంతో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావడం స్థానిక అధికార పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. కనీసం పోలింగ్ పూర్తయ్యేవరకు అయినా రేవులను నిలిపివేయాలనే ప్రయత్నాలు బెడిసికొట్టడంతో అమరావతి పెద్దలకు విషయం చేర్చినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో