జీవితాలు మార్చేవారికీ జీతాల్లేవ్..!
వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులేకాదు.. ఒప్పంద, పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులు కూడా వేతనాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వ్యసన విముక్తి కేంద్రాలనూ సరిగా నిర్వహించలేని వైకాపా సర్కారు
అమలాపురం ఏరియా ఆసుపత్రిలోని కేంద్రం
న్యూస్టుడే, అల్లవరం: వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులేకాదు.. ఒప్పంద, పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులు కూడా వేతనాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్తు పదార్థాలకు బానిసలై చెడు మార్గంలో పయనించేవారిలో మార్పు తీసుకొచ్చి సాధారణ జీవితాన్ని అందించేందుకు కృషి చేసే విభాగం అది. ఇక్కడి సిబ్బందికి, వైద్యులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం చెల్లించలేదు. ఇదీ అమలాపురం ఏరియా ఆసుపత్రిలో మత్తు-వ్యసన విముక్తి కేంద్రం దుస్థితి.
జిల్లా కేంద్రంలో ఆర్భాటంగా ఏర్పాటు..
అమలాపురం ఏరియా ఆసుపత్రిలో 2020లో మత్తు-వ్యసన విముక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మద్యానికి బానిసలుగా మారి అనారోగ్యంపాలై ఆసుపత్రికి వచ్చేవారికి ఇక్కడ కౌన్సెలింగ్తోపాటు అవసరమైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం ఈ కేంద్రాన్ని జిల్లా స్థాయికి పెంచారు. దీంతో గతేడాది అక్టోబరులో పూర్తి స్థాయిలో వైద్యులు, కేంద్రం పర్యవేక్షకులు, కౌన్సెలర్లు, ఇతర సిబ్బందిని ఒప్పంద పద్ధతిలో నియమించారు. వైద్యులు, కేంద్రం మేనేజర్, డీఈవో, వంట మనిషి, యోగా నిపుణులు ఒకరు చొప్పున, కౌన్సెలర్లు, ఏఎన్ఎంలు, వార్డు, ఇతర సిబ్బంది ఇద్దరు చొప్పున, క్షేత్ర స్థాయి సిబ్బంది ముగ్గురు కలిపి మొత్తంగా ఈ కేంద్రంలో పరిధిలో 16 మంది విధులు నిర్వహిస్తున్నారు.
ఒక్క నెలా వేతనం కూడా ఇవ్వలేదు..
వీరందరినీ గతేడాది అక్టోబరులో నోటిఫికేషన్ ద్వారా విధుల్లోకి తీసుకున్నారు. వీరికి అదే నెలలో కాకినాడ జీజీహెచ్లో 15 రోజులపాటు శిక్షణ నిర్వహించి అమలాపురం కేంద్రంలో విధులు కేటాయించారు. నాటినుంచి ఇప్పటి వరకు వీరికి ఒక్క నెల కూడా వేతనం మంజూరు చేయలేదు. ఉన్నతాధికారులను అడుగుతుంటే సమాధానం చెప్పేవారే కరవయ్యారని సిబ్బంది వాపోతున్నారు. వేతనాలు ఇవ్వకపోతే తాము ఎలా జీవించాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజల జీవితాలను బాగుచేసే తమ జీవితాలు సర్కారు తీరుతో దుర్భరంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాం..
- ఎం.శ్రీనివాస్, వ్యసన విముక్తి కేంద్రం మేనేజర్
ఏడు నెలలుగా వేతనాల్లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పలుమార్లు అధికారులు, ప్రభుత్వానికి విన్నవించినా వారి నుంచి కనీస స్పందన లేదు. చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబాలను పోషించుకునేందుకు నానాపాట్లు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
పస్తులు ఉండాల్సివస్తోంది
- రత్నకుమారి, క్షేత్రస్థాయి సిబ్బంది
వేతనాలు రాక, కుటుంబం గడవక పిల్లలతో పస్తులు ఉండాల్సివస్తోంది. వీటికి తోడు బ్యాంకు రుణాలు, ఇంటి అద్దెలు కట్టుకోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తక్షణం అధికారులు బకాయిలు చెల్లించాలి. లేదంటే ఆందోళన చేసేందుకు కూడా వెనుకాడం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.