logo

వైకాపాను ప్రభుత్వాన్ని గద్దెదింపాలి

మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచించి ఓటు వేయాలని తెదేపా సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు అన్నారు.

Updated : 06 May 2024 20:46 IST

తాళ్లపూడి: మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచించి ఓటు వేయాలని తెదేపా సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు అన్నారు. తాళ్లపూడి మండలంలోని మలకపల్లిలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలతో సోమవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. బటన్ నొక్కే వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థిని పురందేశ్వరిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారాయచౌదరి, మద్దిపాటి ప్రకాశం, రామారావు, చెరుకూరి వెంకట్రావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని