వీధి వీధినా వెతలు.. పట్టించుకునేదెవరు..
నగరంలోని 25వ డివిజన్లో ఎటుచూసినా సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా మారడం, కాలువలపై స్లాబులు లేకపోవడం, తాగునీటి కొళాయిల లీకేజీ, పేరుకుపోయిన చెత్త,
తాగునీటి కొళాయి లీకులు
న్యూస్టుడే, ఏవీఏ రోడ్డు, కంబాలచెరువు: నగరంలోని 25వ డివిజన్లో ఎటుచూసినా సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా మారడం, కాలువలపై స్లాబులు లేకపోవడం, తాగునీటి కొళాయిల లీకేజీ, పేరుకుపోయిన చెత్త, కచ్చా డ్రెయిన్లలో పూడిక తీయకపోవడం, ప్రమాదకరంగా మ్యాన్హోల్స్ తదితర సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. వేల మంది జనాభా నివాసం ఉంటున్నా సమస్యలను పట్టించుకున్న నాథుడే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూడికతో నిండిన కాలువ
ఇవీ ఇక్కట్లు
- డివిజన్లోని ప్రధాన మార్గాలైన నేతాజీ పాఠశాల నుంచి పెద్ద మసీదుకు వెళ్లే రోడ్డు, దానికి అనుసంధానంగా ఉన్న అంతర్గత రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. గుంతలతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
- మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. అంతర్గత రోడ్లు ఛిద్రమవడంతో రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
- చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. వీధి మలుపుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది.
- రోడ్ల పక్కన కాలువలపై స్లాబులు సక్రమంగా లేవు. విరిగిపోవడంతో ఊచలు పైకి తేలి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. రోడ్ల మధ్య పలకల అమరిక లేక రాత్రి సమయాల్లో వాహనదారులు పడి పోతున్నారు.
- కొన్ని ప్రాంతాల్లో కచ్చా డ్రెయిన్ల పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీసిన దాఖలాలు లేవు. దీంతో వాడుక నీరు వెళ్లేదారి లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు.
- కొన్నిచోట్ల డ్రెయిన్లలో చెత్త వేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు.
వివరాలు
డివిజన్: 25
పరిధి: రంభ, ఊర్వశి, మేనక థియేటర్, శిక్షణ కళాశాల, గ్రంధివారివీధి తదితర ప్రాంతాలు
జనాభా: సుమారు 5 వేలు
ఇబ్బందులు తొలగించాలి..
- రమేష్, స్థానికుడు
మా ప్రాంతంలో తాగునీరు సక్రమంగా రావడం లేదు. కొన్నిచోట్ల వృథాగా పోతోంది. వృథాను అరికట్టి సక్రమంగా పంపిణీ చేయాలి. వీధి దీపాలు సైతం వెలగక రాత్రి సమయాల్లో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. అంతర్గత రహదారులకు మరమ్మతులు చేసి ఇబ్బం దులు తొలగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ మాయగాళ్ల ఉచ్చులో విశాఖ యువత.. కాంబోడియాలో నరకయాతన
-
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
-
హెచ్చు పందేల జోరు.. రౌండ్ల వారీ మెజార్టీపైనా దృష్టి..
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా