అందరి జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలి
కొత్త సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సుఖసంతోషాలతో తులతూగాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆకాంక్షించారు.
పంచాంగ పఠనం చేస్తున్న చింతలపాటి నాగరాజుశర్మ,
చిత్రంలో కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, జేసీ రాజకుమారి తదితరులు
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: కొత్త సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సుఖసంతోషాలతో తులతూగాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆకాంక్షించారు. ఆర్డీవో కార్యాలయం పక్కనే ఉన్న రెవెన్యూ కల్యాణ మండపంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా అంకితభావంతో పని చేసి మరింత మెరుగైన సేవలందిస్తూ ప్రజలకు చేరువ కావాలని కోరారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు శాంతి, సామరస్యంతో మెలుగుతూ.. సంతోషంతో ఉండాలని, ఉగాది పచ్చడిలో షడ్రుచులు మాదిరిగా మనిషి తన జీవితంలో కలిగే అన్ని రకాల భావోద్వేగాలు సమానంగా స్వీకరించాలన్నారు. పంచాంగ శ్రవణకర్త చింతలపాటి నాగరాజుశర్మ పంచాంగ శ్రవణం చేస్తూ వ్యవసాయ, వాణిజ్య, పర్యాటక, కళారంగాలకు విశేష అభివృద్ధి కలుగుతుందన్నారు. వ్యవసాయ రంగానికి సమృద్ధిగా వానలు కురిసి, డ్యామ్లు నిండి పంటలు బాగా పండుతాయన్నారు. అనంతరం పలువురు అర్చకస్వాములను సన్మానించారు. పోషణ పక్షోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, జేసీ రాజకుమారి తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, సహాయ కలెక్టర్ శివనారాయణ శర్మ అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.