జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు.
సమ్మె కాలానికి పూర్తిగా వేయని వేతనాలు
చంద్రబాబు హయాంలో రూ.4,500 నుంచి రూ.10,500 పెంపు
జగన్ ఐదేళ్ల పాలనలో పెంచింది రూ.వెయ్యే
బాపట్ల, న్యూస్టుడే
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు.. ఖాకీలతో వేధించారు.. పోలీస్స్టేషన్లలో నిర్బంధించారు.. ఎస్మా ప్రయోగించారు.. ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని బెదిరించారు.. బలవంతంగా విరమింపజేశారు.. ఏవో కొన్ని చిన్న చిన్న డిమాండ్లను మాత్రమే నెరవేరుస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ సమ్మె కాలానికి పూర్తిగా సొమ్ములు వేయకుండా.. మెనూ ఛార్జీలు పెంచకుండా మొండిచేయి చూపారు.. చివరకు వైకాపా పాలకుల చేతిలో అంగన్వాడీలు దగాకు గురయ్యారు.
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రూ.4500 ఉన్న అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని తొలుత రూ.7 వేలకు, తర్వాత రూ.10,500 పెంచారు. ఆయాల వేతనం రూ.2,200 నుంచి తొలుత రూ.4500 తర్వాత రూ.6 వేలకు పెరిగింది. అంటే చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో అంగన్వాడీల వేతనం మొత్తం రూ.ఆరు వేలు పెరిగింది. ఐదేళ్ల జగన్ పాలనలో వేతనంలో పెంపుదల రూ.వెయ్యి మాత్రమే జరిగింది.
‘ప్రస్తుతం ఓ పిల్లవాడికి పోషకాహారం వండి పెట్టడానికి రోజుకు రూ.2 మాత్రమే ఇస్తున్నారు. గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగినందున దీన్ని రూ.5 పెంచాలని కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. టీఏ, బకాయిలు చెల్లించాలని కోరినా ఉలుకుపలుకు లేకుండా పోయింది.’
గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని మొసలి కన్నీరు కార్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలో కన్నా అధికంగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, వారితో ఓట్లు వేయించుకుని రాజకీయంగా లబ్ధి పొందారు. అధికారంలోకి వచ్చాక రూ.10,500 నుంచి రూ.11,500 అంటే కేవలం రూ.వెయ్యి మాత్రమే వేతనం పెంచి చేతులు దులిపేసుకున్నారు. ఆయాలకు రూ.6 నుంచి రూ.7 వేలకు పెంచారు. తెలంగాణలో అంగన్వాడీల వేతనం నెలకు రూ.13,500 కావటం గమనార్హం.
వైకాపా ప్రభుత్వ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. విద్యుత్తు ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. జీవన వ్యయం పెరిగి కుటుంబ పోషణ కష్టంగా మారింది. కనీస వేతనాలు పెంచాలని మూడేళ్లుగా ప్రభుత్వానికి అంగన్వాడీలు వివిధ రూపాల్లో వినతిపత్రాలు అందజేశారు. సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరి ప్రదర్శించింది. డిసెంబరు 12 నుంచి జనవరి 22 వరకు కార్యకర్తలు, ఆయాలు 42 రోజులు సమ్మె చేశారు. రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కలెక్టరేట్లను ముట్టడించి శాంతియుతంగా నిరసన తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేశారు. కనీస వేతనం కింద నెలకు రూ.26 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాసిరకం ఫోన్లు.. పనిచేయని యాప్లు
ఈ ఐదేళ్లలో పలు యాప్లు తీసుకొచ్చారు. ఇచ్చిన ఫోన్లు నాసిరకానికి చెందినవి కావడంతో అందులో యాప్లు సరిగా పనిచేయడం లేదు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించడానికి పోషణ ట్రాకర్ యాప్ను తీసుకొచ్చి కుట్ర చేస్తున్నారు. గర్భిణి, బాలింతలకు ఇచ్చే సరకులు దూరం చేయడానికి పేస్ యాప్ను తీసుకొచ్చారు. దీనివల్ల ఫోన్లలో సిగ్నల్స్ సరిగా పనిచేయక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి సరకులు తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. ఆ సరకుల కోసం లబ్ధిదారులు రోజుల పాటు అంగన్వాడీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. యాప్లో నమోదు కాకపోతే సరకులు ఇవ్వలేరు. దీంతో మధ్యలో లబ్ధిదారుల నుంచి అంగన్వాడీలు తిట్లు తింటున్నారు.
అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చటం కన్నా సమ్మెను అణగదొక్కటంపైనే సీఎం జగన్ తొలి నుంచి దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించకుండా పోలీస్స్టేషన్లలో నిర్బంధించి కేసులు పెట్టారు. కేంద్రాలకు వేసిన తాళాలను బలవంతంగా పగలగొట్టించారు. తమ హక్కుల కోసం సమ్మె చేస్తుంటే ప్రతిపక్ష నేతల మాయలో పడి కావాలని ఆందోళనలు చేస్తున్నారని అంగన్వాడీలపై వైకాపా ప్రభుత్వ పెద్దలు విషం చల్లారు. నోటీసులు జారీ చేయించారు. ఎస్మా ప్రయోగించి, ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయించి బెదిరించారు. కనీస వేతనం పెంచకుండానే బలవంతంగా సమ్మె విరమింప జేయించారు. సమ్మె కాలానికి వేతనం చెల్లిస్తామని చెప్పి 12 రోజులకు మాత్రమే ఇచ్చారు. ఇంకా నెల రోజుల వేతనం అందాల్సి ఉంది.
వేతనాలు పెంచకపోవటం అన్యాయం
- ఝాన్సీ, అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాన్ని కేవలం రూ.వెయ్యి మాత్రమే పెంచింది. సీఎం జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు, విద్యుత్తు ఛార్జీలు బాగా పెరిగాయి. కనీస వేతనం పెంచాలని నాలుగేళ్లుగా పోరాటం చేశాం. ప్రభుత్వం ఏ మాత్రం కనికరం చూపలేదు. తెలంగాణ కన్నా అధిక వేతనం ఇస్తామన్న జగన్ హామీని నిలబెట్టుకోలేదు. మెనూ ఛార్జీలు పెంచలేదు. జులైలో పెంచుతామని కొత్త ప్రభుత్వంపై వదిలేసి చేతులు దులిపేసుకున్నారు.
అమానుషంగా ప్రవర్తించారు
- రేఖా ఎలిజబెత్, అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలపై వైకాపా ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించింది. విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అంగన్వాడీలను మహిళలని చూడకుండా పోలీసులు బలవంతంగా లాగి, వాహనాల్లో విసిరేశారు. కార్యకర్తల చీరలు ఊడిపోతున్నా మానవత్వం చూపలేదు. పోలీసుల ద్వారా అంగన్వాడీల రక్తం కళ్లచూశారు. ఏ ప్రభుత్వం మా పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. కర్కశంగా వ్యవహరించి పోరాటాన్ని అణిచివేయాలని ప్రయత్నించారు. తక్కువ వేతనంతో ఎలా జీవించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధ్యత మరిచారు.. భ్రష్టు పట్టించారు!
[ 05-05-2024]
పౌరులంతా క్షేమంగా సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పాలకులదే. జగనన్న రాజ్యంలో తాడేపల్లి ప్యాలెస్ ఒక్కటే భద్రంగా ఉంది. ప్యాలెస్ పక్కనే గంజాయి బ్యాచ్లు చెలరేగుతున్నా జగన్ ఉలుకూ పలుకూ లేకుండా శిలలా ఉన్నారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి
[ 05-05-2024]
‘ఇకపై మంగళగిరే నా సొంత ఊరు. మా కుటుంబంపై ప్రజల అభిమానం అపురూపం. ఇక్కడి వాతావరణం కుమారుడు దేవాన్ష్కు కూడా బాగా నచ్చింది. మంగళగిరిలో లోకేశ్ విజయం తథ్యం. ఎంత మెజార్టీ సాధిస్తారన్నదే మిగిలింది.’ అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. -
ఎగసిన ‘జన’ కెరటం
[ 05-05-2024]
రేపల్లె తీర ప్రాంతానికి జనసేనాని రాకతో అభిమాన జన కెరటం ఉవ్వెత్తున ఎగసింది. చిన్నాపెద్దా తేడా లేకుండా తరలివచ్చిన జనాలతో రేపల్లె పట్టణం కిక్కిరిసింది. తెదేపా-జనసేన-భాజపా కూటమి ఆధ్వర్యంలో శనివారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు పవన్కల్యాణ్ హాజరయ్యారు. -
గుండెలదిరేలా గ్రామాల రోడ్లు
[ 05-05-2024]
-
ఏళ్లుగా సడలని సంకల్పం
[ 05-05-2024]
మొక్కవోని దీక్ష, పట్టుదలతో అమరావతిని కాపాడుకోవడం కోసం అన్నదాతలు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 1600 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్ని అవమానాలు, అవరోధాలు ఎదురైనా పంటిబిగువున ఎత్తిన చెయ్యి దించకుండా ప్రతి దశలోనూ మహిళలు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. -
‘జలకళ’లో జగన్ దగా
[ 05-05-2024]
రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం చేపట్టాం. బోరుతో పాటు కేసింగ్పైపును కూడా ఇవ్వబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.2340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెబుతున్నాం. -
‘మోసానికి’ బ్రాండ్ అంబాసిడర్
[ 05-05-2024]
మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. లబ్ధిదారులకిచ్చిన ప్లాట్లలో ఐదేళ్లకాలంలో ఎలాంటి మౌలిక వసతులనూ కల్పించలేదు. -
సీలు వేశాం.. కానీ ఊడిపోయింది..!
[ 05-05-2024]
-
ఆంధ్రుల కలల రాజధాని తరలిస్తామంటే మిన్నకుండిపోయారు
[ 05-05-2024]
-
వైకాపా నేతలపై చర్యలకు డిమాండ్
[ 05-05-2024]
పొన్నూరులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా నేతలు హెలీప్యాడ్ను ధ్వంసం చేశారని, దీనిపై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, ఎ.ఎస్.రామకృష్ణ తదితరులు. -
సూపర్-6తో అపూర్వ ప్రగతి
[ 05-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో అన్నిరంగాలు, వర్గాల ప్రజలు దగా పడ్డారు. దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, హత్యలు, అరాచకాలు అడ్డులేకుండా పోయాయి. ప్రగతి కనుచూపు మేరలో కానరాలేదు. ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. -
కాలనీల్లో సమస్యలు పరిష్కరిస్తాం : నాదెండ్ల
[ 05-05-2024]
పట్టణంలోని యడ్లలింగయ్య, ఫులె కాలనీల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాగునీటి, డ్రైనేజీ సమస్య ఆయనకు తెలియజేయగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
వైకాపా నాయకుల కవ్వింపు చర్యలు
[ 05-05-2024]
తాడికొండ మండలం మోతడక గ్రామంలో శనివారం వైకాపా అభ్యర్థి మేకతోటి సుచరిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద ఉన్న తెదేపా కార్యాలయం వద్ద ఖాళీ ప్రచార రథంతో పాటు వైకాపా అల్లరి మూక వచ్చారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు
[ 05-05-2024]
రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 9న తిరుపతిలో 20.20 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07510) తెనాలి 01.58, గుంటూరు 02.20, నడికుడి 04.00, సికింద్రాబాద్ 09.10 గంటలకు చేరుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్