పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నేటితో ముగియనున్న గడువు
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు పని చేస్తున్న కేంద్రాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాల్లో మాత్రమే మే 5 నుంచి 8వ తేదీల మధ్యలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. పీవో, ఏపీవోలు మొదటి విడత శిక్షణ తరగతుల్లో ఫారం-12 ఇవ్వని వారితో పాటు ఓపీవోలు, సూక్ష్మ పరిశీలకులు, ఎంసీసీ బృందాలు, ఇతర ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఫారం-12, డ్యూటీ ఆర్డర్ కాపీ, ఓటరు కార్డు కాపీని జత చేసి 2 సెట్లు (పార్లమెంటు, అసెంబ్లీకి) వారు పని చేస్తున్న కార్యాలయ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్వో, ఏఆర్వో(తహసీల్దార్)కి ఈనెల 26వ తేదీ లోపు అందజేయాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండి పోస్టల్ బ్యాలట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు వారికి ఓటు ఏ నియోజకవర్గంలో ఉన్నా (ఇతర జిల్లాలో కూడా) ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయం పరిధిలోని ఫెసిలిటేషన్ కేంద్రంలో మాత్రమే ఓటు ఇస్తారన్నారు. పీవో, ఏపీవోలు మే 5, 6 తేదీల్లో నిర్వహించనున్న 2వ విడత శిక్షణ తరగతులకు హాజరై అక్కడ ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో శిక్షణ ముగిసిన తర్వాత పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వేయాలని సూచించారు. సూక్ష్మ పరిశీలకులు, పోలీసు సిబ్బంది, ఇతర ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, అత్యవసర సేవలకు సంబంధించిన సిబ్బంది ఫారం-12ని పూర్తి చేసి ఇస్తే.. వారు పనిచేస్తున్న కార్యాలయం ఏ నియోజకవర్గం పరిధిలో ఉందో.. అక్కడే ఆర్వో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో మే 8న పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వినియోగించుకోవచ్చని తెలిపారు. పోస్టల్ బ్యాలట్ కోసం దరఖాస్తు అందజేసే గడువు శుక్రవారంతో ముగియనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోం ఓటింగ్ నిలిపివేత
[ 04-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని లేవల్లపాడు గ్రామంలో సీలు లేకుండా జరుగుతున్న హోం ఓటింగ్ను తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లు శనివారం నిలిపివేశారు. -
జగన్, జవహర్రెడ్డికి వృద్ధుల ఉసురు తగులుతుంది: వర్ల రామయ్య
[ 04-05-2024]
జగన్ను అదికారంలో ఉంచడమే సీఎస్ జవహర్రెడ్డి లక్ష్యమని తెదేపా సీనియర్నేత వర్ల రామయ్య ఆరోపించారు. -
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
[ 04-05-2024]
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రలోభాలు
[ 04-05-2024]
జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ బాధ్యతల నిర్వహణతోపాటు వివిధ అంశాల్లో ఐదేళ్లు రాచిరంపాన పెట్టడంతో వైకాపా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల్ని ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
‘పేదకు నరకం’.. లేదే కనికరం..
[ 04-05-2024]
రాజేష్, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం. -
‘సంక్షేమం పేరుతో జగన్ నమ్మక ద్రోహం’
[ 04-05-2024]
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమం పేరుతో ముస్లిం, మైనార్టీలకు నమ్మక ద్రోహం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ పేర్కొన్నారు. -
రాజధాని వద్దంటూ.. లోకల్ ఎలా అవుతారు?
[ 04-05-2024]
‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. -
372 సమస్యాత్మక కేంద్రాలు
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 1,309 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
జగన్ కుతంత్రం.. ఓడిన మానవత్వం
[ 04-05-2024]
నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి. ఇవీ సీఎం జగన్ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు. -
తొలి రోజు 1,011 మంది గృహ ఓటింగ్
[ 04-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు రెండు రోజుల పాటు ఓటింగ్ చేసుకునే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. -
జగన్.. మాపై ఎందుకీ కక్ష?
[ 04-05-2024]
భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం. -
జగన్ను గద్దె దించడానికి నిరుద్యోగులు సిద్ధం
[ 04-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను మోసగించిన సీఎం జగన్ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్లు మేర చేపట్టిన నిరుద్యోగ చైనత్యయాత్ర శుక్రవారం మంగళగిరి చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM