నేతలకు లబ్డబ్బు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు.
అల్లంత దూరంలో పోలింగ్
భారీగా ఖర్చవుతోందని ఆందోళన
ఈనాడు-అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. వివిధ రూపాల్లో ఓటర్లను కలుసుకునేలా కార్యక్రమాలు నిర్వహించారు. అభ్యర్థిగా ఖరారయ్యాక అందరినీ కలవడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ముందుగానే ప్రచారాలు చేపట్టారు. ఏప్రిల్ రెండో వారంలో పోలింగ్ ఉంటుందన్న అంచనాతో అందుకు అనుగుణంగా సిద్ధమయ్యారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించడమే ఇందుకు కారణం. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి 58 రోజులు ఉండడంతో అభ్యర్థులు అన్నిరోజులా అని అవాక్కయ్యారు. పోలింగ్కు ఇంకా 46 రోజుల సమయం ఉండడంతో అప్పటివరకు ప్రచారం ఖర్చులు, కార్యకర్తల వ్యయం, అనుచరగణాన్ని భరించడం ఎలాగనే ఆలోచనలో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ్చ
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అధికార పార్టీ, తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. ఎన్నికల్లో ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీల నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కొందరైతే ఎన్నికల కోడ్ వస్తే ఖర్చు చేసిన సొమ్ము లెక్కల్లోకి వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే ఆయా సామాజికవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారి అవసరాలు తీర్చారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలు సందర్శించి అక్కడికి అవసరమైన సౌకర్యాల కల్పనకు చేయూతనిచ్చారు. డిసెంబరు నెలలోనే వైకాపా కొందరు అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు వివిధ వర్గాల ఓటర్లతో సమావేశాలు నిర్వహించి విందు భోజనాలు వడ్డించి అందరికీ బహుమతులు ఇచ్చి ఓటు వేయాలని కోరారు. వివిధ వృత్తులు, వ్యాపారులు ఇలా ప్రతిఒక్కరినీ ప్రసన్నం చేసుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. మహిళలు, క్షేత్రస్థాయిలో పని చేసే మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొన్ని నియోజకవర్గాల్లో వారు ప్రణాళిక ప్రకారం తాయిలాల పంపిణీ పూర్తిచేశారు. షెడ్యూల్ వచ్చినా ఏప్రిల్ రెండో వారంలో పోలింగ్ జరుగుతుందని అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా ఖర్చులకు సొమ్ములు సిద్ధం చేసుకున్నారు. అనూహ్యంగా మే 13న పోలింగ్ తేదీ ప్రకటించడంతో మరో నెల రోజుల పాటు ఖర్చులకు సొమ్ములు సర్దుబాటు చేసుకోవాలని అభ్యర్థులు మదనపడుతున్నారు. ఎన్నికల ప్రచార రథాలు, నేతలకు వాహనాలు సమకూర్చడం, కరపత్రాలు, జెండాలు, కార్యకర్తలకు భోజనాలు, అల్పాహారం ఇలా ప్రతిదానికి రూ.లక్షల్లో సొమ్ము ఖర్చవుతోంది. నెల రోజులు పెరిగినందున ఆ మేరకు ఖర్చు కూడా తడిసిమోపెడవుతుందన్న ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది.
ద్వితీయశ్రేణి నేతలను నిలబెట్టుకోవడానికి..
అధికార పార్టీలో కొందరు అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉన్న క్రమంలో అక్కడి ద్వితీయ శ్రేణి నేతలు కూటమి అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించిన అధికార పార్టీ నేతలు వారికి ఆర్థికంగా చేయూత అందించి సర్దుబాటు చేసుకుంటున్నారు. పొరుగు నియోజకవర్గాల నుంచి బదిలీపై వచ్చిన అభ్యర్థులు స్థానిక ద్వితీయశ్రేణి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి నానావస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే వల్ల తాము ఇబ్బందులు పడ్డామని నేతలు చెబుతుండగా వారందరికీ ఆర్థికంగా ఇచ్చుకోవాల్సి వస్తోంది. పోలింగ్ త్వరగా జరిగిపోతే బాగుణ్ణు.. అని అభ్యర్థులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
కార్యాలయాల ఏర్పాటుపై మీమాంస
ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు చాలాచోట్ల పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారు. అక్కడి నుంచి కార్యకలాపాల నిర్వహణ, సమన్వయం చేసుకుంటారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పటికే కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ, మండల, డివిజన్ల స్థాయిలో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు అభ్యర్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడే వాటిని ఏర్పాటు చేస్తే అద్దెతోపాటు నిర్వహణ భారంగా మారుతుందని భావిస్తున్నారు. ఏ పని చేయాలన్నా ఇంకా 46 రోజులు ఉందంటూ దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వట్టిచెరుకూరులో తెదేపా సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
[ 27-04-2024]
వట్టిచెరుకూరు మండలంలోని ఇంజనంపాడు గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో శనివారం సూపర్ సిక్స్ పథకాల శంఖారావం కార్యక్రమాలను నిర్వహించారు. -
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే