logo

‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’

వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు.

Published : 28 Mar 2024 06:26 IST

తుళ్లూరు, న్యూస్‌టుడే: వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దొండపాడులో నిరసనలు చేస్తున్న మహిళలతో కలసి ఆమె మాట్లాడారు. అయిదేళ్ల జగన్‌ పాలనలో వినాశకర విధానాలకు వత్తాసు పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఓడించాలని పిలుపునిచ్చారు. వైకాపాకు ఓటు వేస్తే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని స్పష్టం చేశారు. వైకాపా చెర నుంచి అమరావతిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు, తాడికొండ తదితర గ్రామాల్లోనూ పలు చోట్ల నిరసనలు కొనసాగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని