పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఫారం-12 స్వీకరణకు మీనమేషాలు
ఈనాడు, అమరావతి
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ విధుల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లు(పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (ఏపీఓ), అదర్ పోలింగ్ ఆఫీసర్లు పాల్గొంటారు. ఒక్కో బూత్లో ఒక పీఓ, ఒక ఏపీఓ, నలుగురు ఓపీఓలు ఉంటారు. ఓపీఓలుగా సెకండరీ గ్రేడ్ టీచర్లు తదితరులు ఉంటారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సంబంధించి వారి ఉద్యోగ ఐడీ నంబరు, పనిచేస్తున్న విభాగం, డిసిగ్నేషన్తో పాటు వారికి ఓటు హక్కు ఎక్కడ ఉంది? ఆ పోలింగ్ బూత్ వివరాలతో సహా ముందుగానే ఫారం-12లో నింపి వాటిని అందజేయాలి. ఈ వివరాలను గతంలో వారు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ప్రాంత ఆర్వో లేదా వారు సూచించిన హెల్ప్లైన్ కేంద్రంలో అందజేసేవారు. వారికి ఎక్కడైతే ఓటు ఉంటుందో ఆ నియోజకవర్గ హెడ్క్వార్టర్ తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని ఇబ్బంది పెడుతున్నారు.
ఉదాహరణకు ఫిరంగిపురంలో ఓటు కలిగిన ఉద్యోగి ఫారం-12లో వివరాలు నమోదు చేసి ఆ పత్రాలను తీసుకెళ్లి 40 కి.మీ దూరంలో ఉన్న తాడికొండలో అందజేయాలని చెబుతున్నారు. వాస్తవంగా అయితే సదరు ఉద్యోగి ఫిరంగిపురం తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తే సరిపోతుంది. సదరు తహసీల్దార్ ఆ వివరాలను తాడికొండ ఎమ్మార్వోకు పంపితే సరిపోతుంది. కానీ ఉద్యోగినే నేరుగా తీసుకెళ్లి తాడికొండలో అందజేయాలని సూచించడంతో 40 కి.మీ దూరం వెళ్లి ఏం అందజేస్తామని కొందరు బద్ధకిస్తే ఆ మేరకు సదరు ఉద్యోగి తన పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోలేరు. ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెడితే వారు ఓటు హక్కు వినియోగించుకోలేరన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఓపీఓలు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు ఉంటారు. వీరంతా తాము పనిచేసే మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో కలిసి ఇస్తే వాటిని స్వీకరించేలా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా సులభతరం చేస్తేనే ఉద్యోగులు అందరూ తమ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోగలరని ఉద్యోగ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ నెల 22 లోపు ఆ వివరాలను అందజేయాలి. వీరంతా వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ అసౌకర్యం లేకుండా పని ప్రదేశం లేదా నివాసం ఉండే మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో అందజేసేలా వెసులుబాటు కల్పించాలని ఓపీఓలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం: చంద్రబాబు
[ 01-05-2024]
రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా మార్చేశారని వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. -
గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించొద్దు: ఈసీకి కూటమి విజ్ఞప్తి
[ 01-05-2024]
గాజు గ్లాసు గుర్తుతో ప్రభావితం అయ్యే 13 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ గుర్తును జనసేనకు రిజర్వు చేయాలని కూటమి నేతలు మారోమారు ఈసీని కోరారు. -
పండుటాకులే ఎండగడతాయి జగన్!
[ 01-05-2024]
వెల్దుర్తి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వజ్రాలపాడు తండా, రామచంద్రాపురం తండా, సేవానాయక్ తండా, కొత్తపుల్లారెడ్డిగూడెం, దావుపల్లి తండాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 700 మంది వరకూ వృద్ధులున్నారు. -
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
[ 01-05-2024]
నందమూరినగర్లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో పెద్ద మొత్తంలో పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్ల కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వీటిని ఆర్డర్ ఇచ్చాడని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్ యజమాని గురుప్రసాద్ చెబుతున్నారు. -
అరాచక మూకలను ఓడించండి!
[ 01-05-2024]
‘తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్ అవకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ పెట్టించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన స్థితి నెలకొంది. -
ప్రతిపక్షాలపై కక్ష.. పింఛనర్లకే శిక్ష
[ 01-05-2024]
పింఛను సొమ్ము కోసం ఎవరూ సచివాలయాలకు రావొద్దని ఇళ్లకు వెళ్లి ఉద్యోగులు చెప్పడంపై పింఛనుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది లేరని సాకులు చెబుతోంది. -
కార్మికలోకం కకావికలం
[ 01-05-2024]
అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. మూడు ప్రాంతాల అభివృద్ధికి కనీసం 30వేల ఎకరాలు ఉండాలి. అమరావతిలోనే నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను. ఇక్కడే ఉంటాను. తెదేపా కన్నా దీటుగా రాజధాని నిర్మిస్తాను. -
కరకట్టపై కక్ష...!
[ 01-05-2024]
అమరావతి అంటేనే పొడ గిట్టని సీఎం జగన్.. దానిని ధ్వంసం చేసేందుకు శక్తిమేర ప్రయత్నించారు. రాజధానికి వెళ్లేందుకు సరైన అనుసంధాన రహదారి లేకుండా చేశారు. కరకట్ట రోడ్డును విశాలంగా విస్తరిస్తానని శంకుస్థాపన సమయంలో మాట ఇచ్చి.. ఆనక మడమ తిప్పేశారు. -
‘మే’మూ కడతాం ఇసుకాసురులకు పా‘డే’
[ 01-05-2024]
పెదకూరపాడు నియోజకవర్గం అమరావతికి చెందిన రామాంజనేయులు భవన నిర్మాణ కార్మికుడు. 2019 వరకూ సొంతూరులోనే పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలతో హాయిగా కాలంగా వెళ్లదీశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత సృష్టించడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. -
తీరాన ప్రజాగళానికి సన్నద్ధం
[ 01-05-2024]
-
ఏకోపాధ్యాయ పాఠశాలలు.. దిగజారిన విద్యా ప్రమాణాలు
[ 01-05-2024]
రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారకుండా చూస్తాం.. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల అమలును విస్మరించారు. ఉపాధ్యాయ నియామకాల కోసం ఒక్క డీఎస్సీ కూడా వేయకుండానే అయిదేళ్ల పాలన పూర్తి చేశారు. -
‘జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’
[ 01-05-2024]
రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్న జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాల మహా సభ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్లెల వెంకట్రావు కోరారు. రిపబ్లికన్ పార్టీ మంగళగిరి అభ్యర్థి, న్యాయవాది గుర్రం రామారావుతో కలసి అమరావతి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ..
[ 01-05-2024]
తెదేపా జాతీయ కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తరఫున ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. -
‘వైకాపా పాలనలో ఛార్జీల బాదుడు’
[ 01-05-2024]
వైకాపా పాలనలో ప్రజలపై నిత్యావసర సరకులు, విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి నాయకులు కోటేశ్వరరావు, కంతేటి బ్రహ్మయ్య ఆరోపించారు. -
శిడిమాను ఉత్సవం..భక్త సంబరం
[ 01-05-2024]
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో జగన్మాత పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. దూరప్రాంతాల నుంచి వేలాది మంది తరలి రావడంతో గ్రామం కిక్కిరిసింది. -
కూటమి గెలుపు అభివృద్ధికి మలుపు
[ 01-05-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని రసూల్ పేట, కొత్తపేట, బీసీ కాలనీలో మంగళవారం తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సప్లిమెంటరీ ఫీజుల చెల్లింపునకు మే 4 వరకు గడువు
[ 01-05-2024]
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు రుసుం చెల్లించేందుకు గడువు మే 4 వరకు ఉందని డీఈవో ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. -
వైకాపాకు గుంటూరు డిప్యూటీ మేయర్ సజీల రాజీనామా
[ 01-05-2024]
వైకాపాకు రాజీనామా చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..