పండుటాకులే ఎండగడతాయి జగన్!
వెల్దుర్తి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వజ్రాలపాడు తండా, రామచంద్రాపురం తండా, సేవానాయక్ తండా, కొత్తపుల్లారెడ్డిగూడెం, దావుపల్లి తండాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 700 మంది వరకూ వృద్ధులున్నారు.
పింఛన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిప్పుతారా
ప్రభుత్వంపై పింఛనుదారుల ఆగ్రహం
ఈనాడు డిజిటల్ - నరసరావుపేట, న్యూస్టుడే - బృందం
వెల్దుర్తి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వజ్రాలపాడు తండా, రామచంద్రాపురం తండా, సేవానాయక్ తండా, కొత్తపుల్లారెడ్డిగూడెం, దావుపల్లి తండాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 700 మంది వరకూ వృద్ధులున్నారు. వెల్దుర్తి వెళ్లడానికి ఆటోలు ఉండవని ఎండలో ఎలా వెళ్లి తెచ్చుకోవాలని అంటున్నారు.
అచ్చంపేట మండల కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలో మాదిపాడు, గిందిపల్లి, చల్లకరిగ గ్రామాలున్నాయి. వీటికి సరైన రవాణా వసతి లేదు. ఇక్కడ వందల్లో పింఛనుదారులు ఉన్నారు. వీరంతా పింఛను తీసుకోవడానికి మండల కేంద్రానికి రావాల్సిందే. ఎండలో వెళ్లాలంటే కష్టం. వీళ్లంతా బ్యాంకులో కంటే ఇంటికే తెచ్చి ఇవ్వాలని కోరుతున్నారు.
పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వ తీరును పింఛనుదారులు తప్పుపడుతున్నారు. ప్రజల క్షేమం కోరుకుంటే సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయవచ్చని అంటున్నారు. కావాలనే ఇబ్బంది పెడుతుందని, ఎండల్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పాలనే ఆలోచనతోనే ఇలా చేస్తుందని దుయ్యబడుతున్నారు. కొందరికి ఇంటి వద్ద పంపిణీ చేసి మిగతా వారికి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని ఆక్షేపిస్తున్నారు. తీవ్ర ఎండలు మండుతున్న వేళ ఇదేం తీరు అని ప్రశ్నిస్తున్నారు. ఖాతాకు ఆధార్ అనుసంధానమైందో లేదో తెలీదని కొందరు పేర్కొంటే, అయిదేళ్లుగా బ్యాంకు పుస్తకమే వాడడం లేదని మరికొందరు చెప్పారు. కొన్నిమండల కేంద్రాల్లో బ్యాంకులకు బదులు పీసీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ నగదు రూ.పదివేలు కంటే తక్కువ మాత్రమే బయోమెట్రిక్ ద్వారా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే వృద్ధుల్లో చాలామందికి వేలిముద్రలు పడవు. ఇదో పెద్ద సమస్య. అప్పట్లోనే వేలిముద్రలు పడకే పింఛను తీసుకోవడానికి గంటలకొద్దీ ఎదురుచూసేవారు. అంతేకాదు కొన్నిసార్లు అయితే వేలిముద్ర పడక తర్వాతి రోజు రావాల్సి వచ్చేది. మరోసారి అలాంటి కష్టాలే ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
తొలిరోజు కేవలం 71,228 మందికే ఇచ్చే ఏర్పాట్లు
పల్నాడు జిల్లాలో మే ఒకటిన 71,228 మందికి ఇంటికి వచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి నగదు తీసుకున్నారు. 71,228 మందికి రూ.21 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, మంగళవారం సాయంత్రం నాటికి రూ.16.71 కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు కావడంతో అంతవరకే విత్డ్రా చేశారు. మిగతా సొమ్ము గురువారం జమ అవుతుందని, సచివాలయ సిబ్బంది డ్రా చేసి పంపిణీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి తొలి రోజు కేవలం ఇంటింటికి పంపిణీ చేసే పింఛనుదారులకు మాత్రమే నగదు అందనుంది. మే ఒకటి తర్వాతే బ్యాంకు ఖాతాల్లో పింఛను సొమ్ము జమ చేయనున్నారు.
బ్యాంకులకు ఎలా వెళ్లగలం!
ఇంట్లో ముగ్గురికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. తల్లి చండ్ర కొండమ్మ మాట్లాడలేదు. ఒక కుమార్తె నాగమణి ఒంటరి మహిళ. మరో కుమార్తె పద్మ మానసిక వికలాంగురాలు. వీరికి పింఛన్లు ఇంటి వద్దనే పంపిణీ చేసేవారు. ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంకులకు వెళ్లి పింఛను తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెలలో ఆలస్యంగా ఉద్యోగులు ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకుకు వెళ్లమంటున్నారని ఎలా సాధ్యమని లబ్ధిదారులు వాపోతున్నారు.
రోడ్డు సరిగాలేదు.. ఆటోలు తిరగవు..
మించాలపాడు రహదారి ఇలా..
దుర్గి మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతానికి సమీపంలో విసిరేసినట్లు మించాలపాడు గ్రామం ఉంటుంది. ఊరిలో మొత్తం 70 మంది వరకు పింఛనుదారులు ఉన్నారు. వారిలో 55 మందికి బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. ఈ గ్రామానికి రహదారి సక్రమంగా లేక ఆటోలు కూడా అందుబాటులో లేవు. బ్యాంకులు మండల కేంద్రమైన దుర్గిలో ఉండడం వల్ల ప్రత్యేకంగా ఆటో తెప్పించుకుని వెళ్లి రావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పింఛను నగదులో ఆరేడు వందలు బ్యాంకుకు వెళ్లి తెచ్చుకోవడానికే ఖర్చు అవుతుందని లబ్ధిదారులు చెబు తున్నారు.
వేలిముద్రలు పడవు
బ్యాంకుకు వెళ్లి పింఛను తీసుకోవాలంటే నరకయాతన. పీసీ కేంద్రంలో తీసుకోవాలన్నా వేలిముద్రలు పడవు. ఈ వయసులో మమ్మల్ని కష్ట పెట్టడం అవసరమా. ఎండలకు అంతంత దూరం వెళ్లలేం. తీసుకెళ్లేవారూ లేరు. పింఛను అందుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గోవింద రాజులు, శ్రీరాంనగర్, వినుకొండ మండలం
ఇంటికే వచ్చి ఇస్తే మేలు
ఏప్రిల్ మొదట్లో సచివాలయానికి వెళ్లి పింఛను తీసుకున్నా. ఈ సారి బ్యాంకుకు వెళ్లమంటున్నారు. మా ఊరు నుంచి వినుకొండ వెళ్లాలి. చాలా దూరం. ఆటోలు, బస్సులు సరిగా ఉండవు. ఇంటికే తెచ్చి పింఛను ఇస్తే మేలు.
ఆకుల గాలయ్య, దోమలగూడెం, బొల్లాపల్లి మండలం
వడగాల్పులకు వృద్ధులు వెళ్లేదెలా?
ఇంటి బయట కూర్చుంటేనే వేడిగాలికి ఉండలేకపోతున్నాం. అలాంటిది వడగాల్పులకు బ్యాంకులకు వెళ్లి పింఛను ఎలా తీసుకోవాలి? అందరికీ ఇంటికే తెచ్చి ఇచ్చేలా చూడండి. బ్యాంకుల చుట్టూ తిరగాలంటే కష్టం.
కె.రెడ్డి, యలమంద గ్రామం
నడిచే ఓపిక లేదు
పింఛను బ్యాంకులో వేస్తారని చెబుతుంటే విన్నాను. నాకు చదువు లేదు, నకరికల్లులో ఎప్పుడో ఖాతా ప్రారంభించాను. అది సక్రమంగా ఉందో లేదో తెలియదు. సచివాలయ సిబ్బందితో ఇంటికి పంపిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఇంట్లోనే నడిచే ఓపిక లేదు. ఇక నకరికల్లు దాకా ఎలా వెళ్లాలి. అధికారులు ఇంటి వద్దకే వచ్చి ఇస్తే బాగుంటుంది.
వేల్పుల రత్తమ్మ, ఉప్పలపాడు, రాజుపాలెం మండలం
95 ఏళ్ల వయసులో బ్యాంకుకెలా వెళ్లాలి
ఏళ్లుగా పింఛను పొందుతున్నా. ప్రతినెలా ఇంటివద్దకే వచ్చి పింఛను అందిస్తున్నారు. ఈనెల పింఛను సొమ్ము మాత్రం బ్యాంకులకు పడతాయని అంటున్నారు. 95 ఏళ్ల వయసులో బ్యాంకు వద్దకు ఎలా వెళ్లగలను. వృద్ధాప్యంలో పింఛను కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఆలోచించాలి.
ఎస్.రాములమ్మ, బయ్యవరం, క్రోసూరు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
[ 21-05-2024]
పోలింగ్ రోజు, ఆ తర్వాత వైకాపా చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. -
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
[ 21-05-2024]
ఎన్నికల ముందు, తర్వాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్టు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. -
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ
[ 21-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసపై సిట్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నేపథ్యంలో సీఎస్ జవహర్రెడ్డితో డీజీపీ హరీశ్కుమార్ గుప్తా భేటీ అయ్యారు. -
కాలువ ఈ తీరు.. పారేది కన్నీరు
[ 21-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికి అంది వచ్చిన పంట నీటిపాలైంది. -
ముందే గుంతలు.. కళ్లకు గంతలు..
[ 21-05-2024]
గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు కనీస మరమ్మతులు లేక గుంతలమయంగా మారాయి. నగరపాలక సంస్థ ఎదురుగా ఈ పరిస్థితి ఉన్నా అధికారులకు కనిపించడం లేదు. -
బాధ చూడరు.. బాగు చేయరు..
[ 21-05-2024]
జీజీహెచ్ అత్యవసర కేంద్రం నుంచి ఇలా రోగులను స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నది సీటీ స్కాన్ కేంద్రానికి. -
వైకాపా నాయకులకు గుణపాఠం చెప్పాలి
[ 21-05-2024]
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ ఘటనలో మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి ప్రమేయంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు. -
ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షణ
[ 21-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షించేలా బృందాలను ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశించారు. -
న్యాక్ గ్రేడ్కు నిరీక్షణ!
[ 21-05-2024]
వర్సిటీలో బోధన, పరిశోధన ఎలా జరుగుతుందో పరిశీలించి ఐదేళ్లకు ఒకసారి న్యాక్ సంస్థ విశ్వవిద్యాలయాలకు గ్రేడ్ కేటాయిస్తుంది. -
గుంటూరు పశ్చిమ పోస్టల్ బ్యాలట్ల గది మార్పు
[ 21-05-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ల గదిని అధికారులు ఎట్టకేలకు మార్చారు. ఈ నెల 19వ తేదీన ‘ఈనాడు’ లో ‘పోస్టల్ బ్యాలట్లకు భద్రత ఏది’... శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎన్నికల అధికారుల్లో కదలిక వచ్చింది. -
జాతీయ సేవకుల కోసం
[ 21-05-2024]
జాతీయ స్థాయిలో సామాన్యులకు సేవలందించే ఆవకాశం సివిల్ సర్వీసెస్ ద్వారా కలుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ వైపు ఆసక్తి చూపేందుకు అవసరమైన కృషి చేస్తున్నాయి గుంటూరులోని స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్(సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. -
తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి
[ 21-05-2024]
పార్టీ మారాడనే కోపంతో తెదేపా కార్యకర్తపై క్రికెట్ బ్యాట్తో వైకాపా వర్గీయులు దాడి చేశారు. శావల్యాపురం మండలం కిష్ణాపురంలో సోమవారం రాత్రి ఇది జరిగింది. -
బాధితులు తెదేపా వారని.. ఇంత పక్షపాతమా?
[ 21-05-2024]
జిల్లాలోనూ సార్వత్రిక పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లోనే తెదేపా ఏజెంట్లను చితకబాదిన ఉదంతాలు ఆలస్యంగా వెలుగుజూస్తున్నాయి. పోలింగ్ కేంద్రంలో ఏ కొద్దిపాటి గొడవ జరిగినా అక్కడ ఉండే పీవో తన డైరీలో నమోదు చేయాలి. -
ఆ దారి.. మృత్యు వారధి
[ 21-05-2024]
కనిపించని సూచిక బోర్డులు.. ప్రమాదకర మలుపులు.. చోదకుల మితిమీరిన వేగం.. వాహనదారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై నిలుపుతున్న వాహనాలు.. కారణం ఏదైనా.. వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి. -
గ్రానైట్ ముడిరాయి లారీల పట్టివేత
[ 21-05-2024]
గుంటూరు విజిలెన్స్ సీఐ శ్రీహరి తన బృందంతో సోమవారం బల్లికురవ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. -
గుండ్లకమ్మ చుట్టూ ఇసుక దొంగలే
[ 21-05-2024]
ఇసుక దొంగలకు దోచిపెట్టేందుకే గుండ్లకమ్మ నది అన్నట్లు పరిస్థితి ఉందని, అనుమతి లేని తవ్వకాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్.శ్రీధర్ అన్నారు. -
కొంతమంది పోలీసుల తీరుతోనే.. హింసాకాండ
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈనెల 13వ తేదీ, తర్వాత రోజు పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తు బృందం విచారణ చేసింది. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 21-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..